Pawan Kalyan: జనసేన బీఫామ్ పంపిణీ విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇదే.. ఎవరూ ఊహించలేరా?

Pawan Kalyan:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగబోతున్నాయి ఇప్పటికే ఎన్నికల హడావిడి నామినేషన్ల ప్రక్రియ శర వేగంగా సాగుతోంది. నామినేషన్ దాఖలు చేయడానికి నేతలందరూ ఎంతో ఉత్సాహంతో ముందుకు కదిలారు. ఇక నామినేషన్ దాఖలు చేసిన వారందరూ కూడా అంతే ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన బీఫామ్ విషయంలో సినిమాను తలపించే ట్విస్ట్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఏపీలో జనసేన పోటీ చేసే అభ్యర్థులందరినీ కూడా ఈయన ఇటీవల మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఇలా వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ బీఫామ్ అందజేశారు . ఇలా బీఫామ్ అందజేసే వారందరి చేత ప్రమాణాలు కూడా చేయించుకున్నారు. అయితే తిరుపతి జనసేన అభ్యర్థికి పంపిణీ చేసినటువంటి బిఫామ్ ఉత్తుత్తిదే అంటూ తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలోనే మరోసారి తిరుపతి జనసేన నేతల అయినటువంటి పసుపులేటి హరిప్రసాద్ రాజారెడ్డి వంటి తదితరులను ఈయన పిఠాపురం పిలిపించుకున్నారు ఇలా పిఠాపురంలో కలిసిన వారందరికీ పవన్ కళ్యాణ్ తిరుపతి జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాస్ బీఫామ్ వారందరి చేతుల్లో పెట్టి తప్పనిసరిగా గెలిపించాలని ఆయన కోరారు.

ఒకవేళ ఆరని శ్రీనివాసులకు మద్దతుగా జనసేన నేతలు తెలియజేయకపోవడంతో వారిని పిలిపించి వారికి హెచ్చరించాలి కాని ఇలా రెండోసారి బీఫామ్ అందచేయడం అంటే ఇది ఎవరు ఊహించని ట్విస్ట్ అని చెప్పాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లి కూటమి నేతలందరితో కలిసి అక్కడ తప్పనిసరిగా పార్టీ విజయ కేతనం అందుకునేలా వారికి సలహాలు సూచనలు ఇచ్చారు. మరి తిరుపతిలో జనసేన పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది త్వరలోనే తెలియనుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -