Sridevi Drama Company: నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. పవన్ తన ఆటిట్యూడ్ తో కోట్ల సంఖ్యలో అభిమానులకు దగ్గరయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే తొలిరోజే కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు రావడం గ్యారంటీ అనే సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి పవన్ కెరీర్ లోనే కలెక్షన్ల విషయంలో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయనే సంగతి తెలిసిందే.
పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాత తాజాగా వెల్లడించారు. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ ధనరాజ్ తో ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధనరాజ్ గతంలో చేసిన ఒక ట్వీట్ ను ప్రేక్షకులకు చూపించారు.
ఆ ట్వీట్ లో “2020 సంవత్సరంలో నాకు జరిగిన ఏదైనా బెస్ట్ మూమెంట్ ఉందా అంటే అది మీరు రిప్లై ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నా మనసు జల్సాతో తీన్మార్ ఆడుతుంది” అని పేర్కొన్నారు. ఆ ట్వీట్ కు పవన్ రిప్లై ఇస్తూ “ధనరాజ్ గారు మీరు ప్రేమతో తెలియజేసిన శుభాకాంక్షలకు, నా మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా కిక్కు ఇచ్చే మరిన్ని పాత్రలతో అందరినీ ఆనందింపజెయ్యాలని కోరుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ లో చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత హైపర్ ఆది కళ్యాణ్ గారితో ఎప్పుడైనా మాట్లాడారా మీరు అంటూ ధనరాజ్ ను అడగగా ధనరాజ్ ఒక్క నిమిషం అని చెబుతూ షోలో పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి “హల్లో ధనరాజ్ గారు” అని చెప్పడంతో ప్రోమో ఎండ్ అయింది. ఈ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఫోన్ లో ఏం మాట్లాడారో తెలియాలంటే ఫుల్ వీడియో ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. వయస్సులో చిన్నవారిని కూడా గారు అని పిలిచే విషయంలో పవన్ కళ్యాణ్ గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.