Posani: పోసానికి కరోనా.. హాస్పిటల్ కి తరలింపు?

Posani: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళీ కూడా ఒకరు. కమెడియన్ గా నటుడిగా, దర్శకనిర్మాతగా రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు పోసాని మురళీకృష్ణ. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. నెగిటివ్ క్యారెక్టర్లలో మాత్రమే కాకుండా పాజిటివ్ క్యారెక్టర్లలో కూడా నటించి మెప్పించారు.

కేవలం సినిమాల విషయంలోనే కాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న బాలయ్య బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. బాలయ్య బాబు ఇద్దరు వ్యక్తులను చంపేశారని అయినటువంటి వారిని ఏమి చేయలేరు అంటూ సంచులన వాక్యలు చేసిన విషయం తెలిసిందే.. ఇది ఇలా ఉంటే తాజాగా పోసాని కృష్ణ మురళికి కరోనా మహమ్మారి బారిన పడ్డారు.

పోసాని కరోనా బారిన పడటంతో వెంటనే అతని కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారు. ఒక సినిమా షూటింగ్లో భాగంగా పూణేకి వెళ్ళిన పోసాని తాజాగా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకోగా కోవిడ్ 19 అని తేలింది. దాంతో వెంటనే ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స తీసుకుంటున్నారు. అయితే పోసానికి కరోనా మహమ్మారి సోకడం ఇది మూడవసారి అని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -