Pawan-Posani: పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని.. ఏం చెప్పాడంటే?

Pawan-Posani: సినీ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈయనని ఏపీ ప్రభుత్వం ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. అయితే ఏపీ ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే పోసాని రెస్పాండ్ అవుతారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసినటువంటి వ్యాఖ్యలపై పోసాని స్పందించారు.

ఈ సందర్భంగా పోసాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్ల గురించి పవన్ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈయన మాత్రం చాలా సాఫ్ట్ గా పవన్ కళ్యాణ్ కు పలు విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నువ్వు చాలా మంచి వాడివి. నీకు అబద్ధాలు చెప్పడం రాదు నిన్ను కేవలం చంద్రబాబు నాయుడు చెడగొడుతున్నారని పోసాని తెలిపారు.

 

నువ్వు అబద్ధం చెప్పినప్పుడు స్పష్టంగా నీ మొహంలో ఆ తేడా కనపడుతుంది నీకు అబద్ధాలు చెప్పడం రాదు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వంటి వారికి మాత్రమే అబద్ధాలు చెప్పడం చేతనవుతుందని పోసాని తెలిపారు.జగన్ జనాలకు మేలు చేస్తుంటే ఓర్వలేని తనంతో చంద్రబాబు నాయుడు లోకేష్ నిన్ను జగన్మోహన్ రెడ్డి పైకి రెచ్చగొడుతున్నారని తెలుసుకో రాజా అంటూ పోసాని తెలిపారు.

 

నువ్వు సినిమాలలో కింగ్ లాంటి వాడివి కానీ రాజకీయాలలో కాదు. కనుక ఎవరో చెప్పిన మాటలు విని ఏదేదో మాట్లాడేసి డ్యామేజ్ చేసుకోకు అని వినమ్రంగా చెబుతున్నాను రాజా అంటూ పోసాని చాలా సాఫ్ట్ కార్నర్ లో పవన్ కళ్యాణ్ కు ఈ విధంగా సూచనలు చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -