Load Relief : జగన్ చేతకాని పాలనకు కరెంట్ కోతలే సాక్ష్యమా.. విమర్శలు వస్తున్నా మారట్లేదుగా!

Load Relief: ప్రస్తుతం ఏపీలో కరెంట్ కోతలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 24 గంటల్లో కనీసం ఏడు లేదా ఎనిమిది గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇక మరోవైపు ఎండలు మండిపోతుండడంతో దానికి తోడు కరెంటు కోతలు ఉండడంతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా లోడ్ రిలీఫ్ పేరుతో విధిస్తున్న కరెంట్ కోతలతో జనం రోడ్డెక్కుతున్నారు. ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియని పరిస్థితి. విద్యుత్ డిమాండ్ ఉంటే గృహ విద్యుత్ కు డిమాండ్ ఎక్కువగా ఉండే రాత్రి సమయాల్లో విచ్చలవిడిగా కరెంట్ తీస్తున్నారు.

ఇక సాగుకు రోజుకు నాలుగు గంటలు కరెంట్ రావడం కూడా కష్టంగా మారింది. దీంతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. కానీ విద్యుత్ సంస్థలు మాత్రం లైట్ తీసుకున్నాయి. పగలు సమయంలో మాత్రమే కాకుండా రాత్రి సమయంలో కూడా దారుణంగా కరెంటు కోతల విధిస్తున్నారు. అయితే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ కొరత ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు జరిపి ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వడం ప్రారంభించారు. విద్యుత్ విషయంలో పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ మిగిలింది. అయితే అధికారంలోకి వచ్చిన జగన్ ఈగో సమస్యలతో మొత్తం కొలాప్స్ చేశారు. ఇప్పుడు ప్రతి ఏడాది కరెంట్ కోతలు కామన్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలు తరలి పోతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో కరెంట్ చార్జీలు ఊహించనంతగా పెంచారు. దాదాపుగా రెట్టింపు అయ్యాయి. ట్రూ అప్ చార్జీలు, ఇంధర సర్ చార్జీల పేరుతో వరుసగా బడుతున్నారు. కరెంట్ కోతలు లేకుండా బయట నుంచి విద్యుత్ కొన్న చార్జీలట. అంటే ఇచ్చే అరకొరకూడా బయట నుంచి కొంటున్నారు. ఆ చార్జీల్ని ప్రజల నెత్తి మీదే వేస్తున్నారు. ఒక చేతకాని పరిపాలనకు నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎలాంటి పరిస్థితుల్లోనూ కరెంట్ పోదు. నిజానికి ఉత్పత్తిలో తెలంగాణ కన్నా ఏపీకి ఎక్కువ. కానీ నిర్వహణ చేతకాక ఏపీ సర్కార్ చేతులెత్తేస్తోంది. ఒక వైపు ఇలా ప్రజల్ని ఇక్కట్లలో పెట్టి పాలకులు మాత్రం జల్సాలు చేస్తూంటారు. కానీ బయటకు ప్రచారం చేసుకునేది మాత్రం వేరే. కళ్ల ముందు కనిపిస్తున్నా… కరెంట్ తీయడం లేదనే చెబుతారు. దాంతో జగన్ చేతకాని పాలనకు కరెంట్ కోతలే సాక్ష్యమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -