Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అందరి చూపు పిఠాపురం వైఫై ఉంది. పిఠాపురంలో గెలుపు ఎవరిది అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొందని చెప్పాలి. ఇలా పిఠాపురం పైన స్పెషల్ ఫోకస్ ఉండటానికి కారణమేంటనే విషయాన్ని వస్తే ఇక్కడ కూటమి తరపున పోటీ చేయబోతున్నటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాగా ఈయనకు పోటీగా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతాను ఎన్నికల బరిలోకి దింపారు.
ఈ విధంగా ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనే దానిపై పెద్ద ఎత్తున సందేహాలు ఆసక్తి నెలకొంది అయితే ఇప్పటివరకు పిఠాపురంలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నప్పటికీ ఆ ప్రాంత అభివృద్ధికి ఏ మాత్రం సహాయం చేయలేదని తెలుస్తుంది.
ఇలా పిఠాపురంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడంతో ప్రజలు ఈసారి అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే పిఠాపురంలో ప్రజా సర్వే చేయగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఏకంగా లక్ష మెజార్టీతో ఆయన గెలుపుతారని తెలుస్తోంది.
పిఠాపురంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఉన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు అయితే ఈయనకు పోటీగా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వంగ గీతాన్ని కూడా ఎన్నికల బరిలోకి దింపారు. అయితే వంగ గీత ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నప్పటికీ 2009వ సంవత్సరంలో ఈమె ప్రజారాజ్యం పార్టీ తరఫున పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఈసారి ఎవరిది పిఠాపురంలో గెలుపు ఎవరి జెండా ఇక్కడ ఎగరనుంది అనేది తెలియాల్సి ఉంది.