MLA – Lokesh: లోకేశ్ వల్ల మా ఇంట్లో ఇబ్బందులు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు వైరల్!

MLA – Lokesh: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోనే పలు జిల్లాలను పలు ప్రాంతాలను పర్యటిస్తున్న నారా లోకేష్ అక్కడ పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తూ స్థానిక ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల తీరుని ఎండగట్టడంతో పాటు వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బహిరంగ సభలలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు స్పందిస్తూ..

పాదయాత్ర లో భాగంగా లోకేష్ మాట్లాడుతూ రాజకీయాల్లో నేను అవినీతికి పాల్పడి వందల కోట్లు సంపాదించానని పాదయాత్రలో లోకేశ్‌ ఆరోపించారట. నేను ఆయన ప్రసంగాన్ని చూడలేదు. నా భార్య టీవీలో చూశారు. నువ్వు సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నావని మా ఆవిడ ప్రశ్నిస్తోంది. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. దీంతో మా ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి అంటూ వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు. ఆరోపణలు రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. ఒంగోలులోని వైకాపా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో కలిసి మాట్లాడారు.

 

ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలన్నారు. తెదేపా కంటే వైకాపా ప్రభుత్వంలోనే గ్రానైట్‌ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు. చీమకుర్తి జడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యే చేసిన వాక్యాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారడంతో పాటు కాస్త నవ్వులు తెప్పించే టీడీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -