Abhishek Agarwal: రామ్ చరణ్‌కి 50 శాతం వాటా ఉంది.. ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు వైరల్!

Abhishek Agarwal: రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఫ్యాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవ్వడంతో చాలా హైప్ క్రియేట్ చేస్తుంది. నిర్మాత వరుసుగా ఇంటర్వ్యూలకు ఎటెండ్ అవుతున్నారు. ఈ సినిమాలో కృతి సనన్ చెల్లెలు హీరోయిన్ గా పరిచయం అవ్వబోతుంది.

అయితే ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్న అభిషేక అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. రామ్ చరణ్ తన స్నేహితుడైన విక్రం తో ఒక బ్యానర్ మీద ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ద ఇండియన్ హౌస్ అనే సినిమా కథను రాంచరణ్ కి వినిపించారట. ఈ సినిమా బాగా నచ్చడంతో రాంచరణ్ దీనిపైన తను 50% వరకు నిర్మాణ ఖర్చు పెడతానని మాట ఇచ్చారట.

ఈ సినిమా తనకి చాలా ఆసక్తిగా ఉండడంతో దగ్గరుండి తనే ఈ నిర్మాణ పనులు చూసుకుంటానని అన్నారట. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అనేది త్వరలోనే తెలియనున్నది. ఇదిలా ఉండగా టైగర్ నాగేశ్వరరావు సినిమాకు ఎక్కడా లేని హైప్ మొదలవుతుంది ఎందుకంటే రవితేజ కెరీర్ లో ఇదే మొట్టమొదటి ప్యాన్ ఇండియా సినిమా. ఒకవేళ హిట్ అయితే మాత్రం రవితేజ రేంజ్ తెలుగు చిత్రాలకే కాకుండా భారత దేశ చిత్రాల వరకు ఎదుగుతుంది.

దీనికి పోటీగా బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి, విజయ్ తళపతి నటిస్తున్న లియో వస్తున్నాయి. మరి వీటన్నిటి మధ్య దసరాకి ఏ సినిమా విన్నర్ అవుతుందో చూడాలి. ఈ సంవత్సరం దసరా మాత్రం ప్రేక్షకులకు కన్నుల పండగగా నిలిచిపోతుంది. వరుసగా సినిమాల మీద సినిమాలు రావడం, మరోవైపు అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో చత్రపతి సినిమాని రిలీజ్ చేస్తున్నారు కనుక ప్రేక్షకుల ఆనందానికి హద్దే లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -