Producer Chanti Addala: కీర్తి సురేష్ తో అనుకున్న సినిమాకు నష్టాలే ఎదుర్కొన్న చంటి అడ్డాల!

Producer Chanti Addala: చంటి అడ్డాల తెలుగు చలనచిత్ర నిర్మాత. తెలుగు ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్టర్, స్టోరీ రైటర్ గా మంచి అనుభవం ఉంది. చంటి అడ్డాల నిర్మించిన సినిమాలు దాదాపుగా విజయాలే. ఇటీవలే కాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంటి అడ్డాలకు రెండు జెళ్ళ సీత కథ ట్రైలర్ లాంచ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

అందుకు సమాధానంగా తాను కృష్ణవంశీతో ఓసారి మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఉత్తేజ్ తనతో ప్రభుత్ రాంప్రసాద్ అనే వ్యక్తి దగ్గర మంచి కథ ఉంది. ఒకసారి వినండి అంటే తన ఆఫీసుకు పిలిపించుకొని కథ విన్నాడట. సరే కథ బావుంది, రెండు మూడు సీన్లు కాస్త చేంజ్ చేసుకుని వర్కౌట్ చేద్దాం అనుకున్నాడట.

రాంప్రసాద్ కూడా చదువుకున్నవాడు మంచి టాలెంట్ పర్సన్. అయితే తాను తర్వాత చూద్దాం అనుకుంటే ఒక ప్రొడ్యూసర్ వచ్చి లేదు చంటి మనం ఈ సినిమా చేద్దాం, కథ బాగుంది తనను జస్ట్ పార్టనర్ గా ఉండు చాలు అంటే ఓకే చెప్పాడట. అప్పుడు అంతా వాళ్ళు చూసుకుంటారు కదా అని అనుకున్నాడట.

ఫస్ట్ నుండి తాను ఆ సినిమా షూటింగ్ కి కూడా వెళ్లలేదట. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను పక్కన పెట్టవలసి వచ్చిందట. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకున్నారట. ఈ సినిమా ఆగిపోవడంతో నేను శైలజ సినిమా ద్వారా కీర్తి సురేష్ మొదటి సినిమా రిలీజ్ అయింది.

ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ రావడంతో మిగతాది కంప్లైంట్ చేసి ఆ సినిమాను జెమినీ వాళ్లకు ఇవ్వడం జరిగింది. జెమినీ వాళ్లు కూడా వేరే వాళ్లకు ఇచ్చారని తెలిసింది. ఇలా చాలా సినిమాల వల్ల తాను ఎంతో నష్టపోయినని పేర్కొనడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -