Raj Shekawat: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా రామాయణం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆది పురుష్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. అసలు రామాయణం గురించి పూర్తి అవగాహన లేకుండా దర్శకుడు ఈ సినిమా చేశారు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.
ప్రభాస్ అభిమానుల సైతం ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరోతో ఇలాంటి చెత్త సినిమా చేశారు అంటూ దర్శకుడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇందులో ప్రతి ఒక్క పాత్రను మలచిన విధానం ఏ మాత్రం బాగాలేదని ఇక తెలుగులో అయితే కొన్ని చోట్ల తెలంగాణ యాసతో కూడా డైలాగులు చెప్పారని మండిపడుతున్నారు. రామాయణం అంటే ఒక గొప్ప కావ్యం ఆధారంగా సినిమా చేస్తే ఎలా ఉండాలో ఇదివరకు చేసిన సినిమాలను చూసి దర్శకుడు తెలుసుకోవాలని తెలిపారు.
ఇలా ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర కూడా పెద్ద ఎత్తున విమర్శలకు గురి అవుతుంది.ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రభాస్ అభిమానులు డైరెక్టర్ పైన అలాగే సినిమా రచయిత మనోజ్ ముంతాషిర్ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇక వారు కనుక కనపడితే ప్రభాస్ అభిమానులు వారిని కొట్టే అంత కోపంలో ఉన్నారని చెప్పాలి.
ఇక ఈ సినిమాని చాలా ఇష్టానుసారంగా తీయడమే కాకుండా హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు ఈ సినిమాని ఆపడం కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. తాజాగా దర్శకుడు రచయితకు క్షత్రియకర్ని హెచ్చరించింది. ఆ సేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ షేకావత్ మధ్యప్రదేశ్ లోని బియోరాలో విలేకరులతో మాట్లాడుతూ… మాసేనకు చెందినవారు దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ కోసం వెతుకుతున్నారు వాళ్లు కనుక కనపడితే మరుక్షణమే వాళ్ళిద్దరూ చనిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.