Prabhas Fans: డైరెక్టర్ ఓం రౌత్ శకత్వంలో ప్రభాస్,కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీగా విమర్శలను నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటోంది. ఈ సినిమాను చూసిన 50% మంది ప్రేక్షకులు బాగుంది అంటే మిగిలిన 50% బాగోలేదు అట్టర్ ఫ్లాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే అసలు ఇది రామాయణం సినిమానే కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను చూసిన చాలామంది ఇది రామాయణం కాదని అంటున్నారు.
కాగా మూవీ మేకర్స్ రిలీజ్ రోజు వరకు ఈ సినిమాను రామాయణ గాథగానే ప్రచారం చేస ఇప్పుడేమో ఉన్నట్లుండి ఇది రామాయణం కాదు అంటూ ప్లేట్ ఫిరాయిస్తున్నారు. ఆదిపురుష్ రచయితల్లో ఒకరైన మనోజ్ ముంతాషిర్ శుక్లా ఒక టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిపురుష్ రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఇదేం రామాయణం, రామాయణ గాథను ఇలాగేనా తీసేది.. రావణుడేంటి అలా ఉన్నాడు, హనుమంతుడి డైలాగ్స్ ఇంత దారుణమా అంటూ ప్రేక్షకులు చిత్ర బృందం మీద విరుచుకుపడుతున్నారు.
సినిమాలోని సన్నివేశాలు, పాత్రలు, ఇతర అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఒక టీవీ చానెల్ చర్చలో యాంకర్ ప్రస్తావిస్తే.. రచయిత మనోజ్ ముంతాషిర్ చిత్రమైన వాదన చేశాడు. తాము రామాయణం నుంచి చాలా వరకు స్ఫూర్తి పొందిన మాట వాస్తవమే అయినా, తాము తీసింది మాత్రం రామాయణ కథను కాదని.. ఇది కల్పిత కథ అన్నట్లుగా మాట్లాడాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.