Adipurush: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. తాజాగా జూన్ 16 నా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అయింది. ఒకవైపు అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా మరొకవైపు ఒక వర్గం ప్రేక్షకులు నెటిజన్స్ ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తూ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నావ్ ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమంది ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారాలు స్ప్రెడ్ చేస్తూ వివాదాలను మరింత ముదిరేలా చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాపై వచ్చిన విమర్శల్లో అలాంటివి అనేకం జరిగాయి.
ఒక వ్యక్తి ఇలాగే ఆ సినిమాలోని ఒక పాత్రను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పోల్చారు. అయితే అతడికి థానే పోలీసులు గట్టి ఝళకే ఇచ్చారు. నీ కాంటాక్ట్ నంబర్ డీఎ లో షేర్ చేయ్ అని థానే పోలీసులు అడిగేసరికి ఆ నెటిజెన్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఎందుకు సార్, విషయం ఏంటి? అంటూ సన్నాయి నొక్కు నొక్కాడు. అనంతరం థానే పోలీసులే వారి ఫోన్ నంబర్ షేర్ చేసి, దానికి కాల్ చేయమని అడిగారు. ఆదిపురుష్ సినిమా విడుదల అనంతరం ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. కొందరు అదే పాత్రను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో పోలుస్తూ వెకిలిగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొంత మంది నెటిజెన్లు అంటున్నారు. ఇలా ఒకటి రెండు కాదు ఈ సినిమాలో చాలా సన్నివేశాలలో నెగిటివ్ పాయింట్లు వెలికితీస్తూ వేరే వాళ్లతో లేనివోని కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే.. భారీ అంచనాల నడుమ విడుదల ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.