Rajamouli-Mahesh: రాజమౌళి మహేష్ సినిమాను ఈ రేంజ్ లో ప్లాన్ చేశారా?

Rajamouli-Mahesh: ఆర్ఆర్ఆర్ సినిమా తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేసిన ఘనత రాజమౌళికి దక్కింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఆస్కార్ అవార్డ్ వరించిన సంగతి అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లోకి గుర్తింపు పొందిన రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజమౌళి తదుపరి సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే తాజాగా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే ‘ఎస్ఎస్ఎంబి 29’ సినిమా ఏకంగా మూడు భాగాలుగా రూపొందించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ మార్కెట్ సృష్టించుకున్నాడు.

ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకున్న రాజమౌళి ‘SSMB 29’తో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న ‘SSMB 29’ని మూడు భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్నట్లు సమాచారం. దీంతో తమ అభిమాన హీరో గ్లోబల్ స్టార్ గా మారిపోతాడని మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -