Rajamouli: మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ.. నలుగురు హీరోలతో మల్టీస్టారర్ కావాలట!

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా ఎక్కువగా నడుస్తుంది. డైరెక్టర్లు కూడా మల్టీస్టారర్ సినిమాలపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. నిజానికి చెప్పాలంటే ప్రస్తుతం ఈ కోవకు చెందిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇటీవలే దర్శకుడు రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ఆర్ ఆర్ ఆర్.

ఈ సినిమాలో స్టార్ హీరో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రాజమౌళి తన స్టోరీకి తగ్గట్టుగా ఇద్దరు స్టార్ హీరోలను ఎంచుకున్నాడు కాబట్టి ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంది.

కనుక ప్రేక్షకులు కూడా రాజమౌళి సినిమా అంటే చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అందులోనూ మల్టీస్టారర్ సినిమా అంటే మరింత మనసు పాడేసుకుంటారు. ఏదైనా ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు బాగా సక్సెస్ పరంగా పండిపోతున్నాయి. ఇక ఇదే కోవలో ఇతర ఇండస్ట్రీలు కూడా సినిమాలను నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ కొత్తగా ఒక ఆలోచన రాజమౌళి చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట.

అదేమిటంటే స్టార్ హీరో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో ఒక మల్టీస్టారర్ సినిమా వస్తే బావుంటుందని ఆశిస్తున్నారట. అందులోను ఆ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి ప్రాణం పోస్తే బాగుంటుందని తమ అభిమానులు అనుకుంటున్నారు. మరి తమ అభిమానులు కోరిక మేరకు రాజమౌళి ఈ స్టార్ హీరోల సహాయంతో ఒక మల్టీస్టారర్ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లు ఎవరికివారు తమ షెడ్యూల్ పరంగా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -