Ram Charan: రామ్ చరణ్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నా.. వైరల్ అవుతున్న ఫ్యాన్ సంచలన పోస్ట్!

Ram Charan:  తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకరు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న అయితే ఈపాటికి ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ చేసే సమయంలోనే భారతీయుడు 2 సినిమా షూటింగ్ కూడా జరగాలి అని కోర్టు ఆదేశాలు రావడంతో శంకర్ తప్పని సరి పరిస్థితులలో ఆ సినిమా షూటింగ్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ కారణంతోనే సినిమా షూటింగ్ వాయిదా పడింది. అలాగే రామ్ చరణ్ కుమార్తె జన్మించడంతో ఈయన కూడా కొంతకాలం సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చారు.

ఇలాంటి కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా ఈ సినిమా తిరిగి పోస్ట్ పోన్ అయింది.అయితే ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అలాగే ఈ సినిమా నుంచి గత కొంతకాలంగా ఏ విధమైనటువంటి అప్డేట్స్ రావడం లేదు దీంతో విసుగు చెందినటువంటి రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా నుంచి అప్డేట్ కావాలని సోషల్ మీడియా వేదికగా ప్రొడక్షన్ హౌస్ ని ట్యాగ్ చేశారు.

ఇలా ప్రొటెక్షన్ టీం నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో చివరికి ఒక అభిమాని ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వకపోతే తాను సూసైడ్ చేసుకుంటాను అంటూ సూసైడ్ లెటర్ రాయడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రామ్ చరణ్ సినిమాకు సంబంధించి వెంటనే ఏదైనా అప్డేట్ ఇవ్వాలి అలాగే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయాలి ఇలా చేయకపోతే తాను సూసైడ్ చేసుకుంటానని మీకు మూడు రోజుల సమయం మాత్రమే ఇస్తున్నాను అంటూ ఈ లెటర్లో రాసుకొచ్చారు. ఒకవేళ అప్డేట్ రాకపోతే తాను చనిపోతాను నా చావుకు కారణం దిల్ రాజు శంకర్ ఎస్ వి సి ప్రొడక్షన్ హౌస్ ఈ ముగ్గురే కారణమంటూ ఈయన ఈ సూసైడ్ నోట్ లో రాయడం గమనార్హం ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -