Ram Charan: ఉపాసనకు తెలియకుండా ఆ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?

Ram Charan:  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ అదే ఊపుతో శంకర్ దర్శకత్వం రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు రామ్ చరణ్ ఇచ్చినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. చెర్రీకి ఇప్పటికీ చాలామంది హీరోయిన్లతో ఏఫైర్ లు ఉన్నాయి అంటూ గతంలో చాలా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

మొదట చిరుత సినిమా చేసే సమయంలో అందులో హీరోయిన్ గా చేసిన నేహా శర్మని రహస్యంగా రామ్ చరణ్ పెళ్లి చేసుకొని కాపురం కూడా పెట్టాడు అంటూ అప్పట్లో మీడియా మొత్తం కోడై కూసింది. అయితే ఈ విషయంపై ఎప్పుడు స్పందించని మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ ఒక జాతీయ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు. కాగా ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాంచరణ్ ఈమధ్యనే ఒక పండంటి పాపకు జన్మనిచ్చారు. అయితే అలాంటి రామ్ చరణ్ ఉపాసన కి తెలియకుండా ఆ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకున్నారు అంటూ తాజాగా మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు ఈ మధ్యకాలంలో విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు చేశారు. ఒకరు నుపూర్ సనన్ మరొకరు గాయత్రి భరద్వాజ్. ఇక ఇందులో సెకండ్ హీరోయిన్ గా చేసిన గాయత్రి భరద్వాజ్ తనకి రామ్ చరణ్ తో పెళ్లి జరిగింది అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… నాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే పిచ్చి ఇష్టం. ఆయనను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కనేదాన్ని అంటూ చెబుతుండగానే యాంకర్ మధ్యలో కల్పించుకొని కానీ రామ్ చరణ్ కి ఇప్పటికే ఉపాసనతో పెళ్లి జరిగిపోయింది కదా అని మాట్లాడింది. కానీ యాంకర్ మాట్లాడిన మాటలకు స్పందించిన గాయత్రి భరద్వాజ్ అవును ఉపాసనతో రామ్ చరణ్ కి పెళ్లి జరిగింది. కానీ నా కలలో మాత్రం రామ్ చరణ్ తో నాకు పెళ్లి ఎప్పుడో అయిపోయింది. అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. కాగా ప్రస్తుతం గాయత్రి భరద్వాజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -