టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు చరణ్. ఆ తర్వాత మగధీర సినిమాతో నటుడిగా చెరగని ముద్ర వేసుకున్నాడు.
మొత్తానికి రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక ఇటీవల విడుదలైన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగుతుంది. ఆ సినిమాలో రామ్ చరణ్ తన నటనను మరో స్థాయిలో కనబరిచాడు. మొత్తానికి రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో కూడా బాగా ఫేమ్ సంపాదించుకున్నాడు.
ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో ఒక ప్రాజెక్టు విషయంలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలుసు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన కెరీర్ లోనే అతిపెద్ద బ్రాండ్ కు అంబాసిడర్ గా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ఆ బ్రాండ్ విషయానికొస్తే.. హీరో మోటో కార్ప్కు చెందిన గ్లామర్ బైక్కు ఆయన అంబాసిడర్గా చేస్తున్నాడని తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన యాడ్ షూట్ హైదరాబాదులో జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఇంతకు ఈ యాడ్ కేవలం రెండు నిమిషాలు మాత్రమే అన్నట్లు తెలుస్తుంది. ఈ రెండు నిమిషాలు యాడ్ కోసం రామ్ చరణ్ ఎనిమిది కోట్ల పారితోషకం పుచ్చుకున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా రామ్ చరణ్ హాలీవుడ్ రేంజ్ లో హడావిడి చేస్తున్నాడు. ఇక చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసింది.