Mahesh Babu: తెలుగులో ఆ అరుదైన రికార్డ్ సూపర్ స్టార్ కు మాత్రమే సొంతమా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. శ్రీ లీలా మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా ఇటీవలే సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఊహించని విధంగా నిరాశపరిచింది. అయితే ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా ప్రదర్శితం అవుతూ కలెక్షన్ కురిపిస్తూ దూసుకుపోతోంది.

 

ఇది ఇలా ఉంటే 5వ‌ రోజుకు కూడా రెండంకెల పైనే వ‌సూళ్లు సాధించడ‌మే కాకుండా ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి సాధ్యం గానీ రికార్డును మ‌హేశ్‌బాబు సొంతం చేసుకున్నాడు. మొదటి రోజు రూ.94 కోట్ల వసూళ్లను సాధించి రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 5 రోజులు పూర్త‌య్యేస‌రికి ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా 200 కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో టాలీవుడ్‌లో రూ.100 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన ఏకైక‌ హీరోగా మ‌హేశ్‌బాబు మరోసారి రికార్డును సాధించారు.

వరుసగా ఐదు సినిమాలు విడుదల అవ్వగా అవి ఒక్కొక్కటి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించాయి. భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, సర్కారు వారి పాట,గుంటూరు కారం లాంటి సినిమాలు ఒక్కొక్క సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించాయి. అలా ఈ సినిమాను మహేష్ బాబు స్టామినాను నిరూపించాయి. ఇకపోతే మహేష్ బాబు తన తదుపరి సినిమాను దర్శకదీరుడు రాజమౌళితో చేయబోతున్న విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -