Rashmi: ర‌ష్మీ, రాంప్ర‌సాద్ చేసిన ప‌నికి.. స్టేజిపైనే ఏడ్చేసిన హైప‌ర్ ఆది..!

Rashmi బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల మధ్యలో ఎలా గొడవలు పెడతారో అందరికీ తెలిసిందే. నచ్చని వ్యక్తుల ఫోటోలను కాల్చేయండి,చించేయండి.. కారణాలు చెప్పండి అంటూ ఇలా ఏదో ఒక పుల్ల పెడుతుంటుంది బిగ్ బాస్ టీం. ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ కూడా ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నట్టుంది. తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో ఆదికి చుక్కెదురైంది.

బుల్లితెరపై ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి క్రేజ్ వేరే లెవ‌ల్‌‌లో ఉంది. ఈ షోల నుంచి ఎంత‌మంది వెళ్తున్నా స‌రే ఇంకా క్రేజ్ త‌గ్గ‌ట్లేదు. ఎంత‌మంది వ‌స్తున్నా స‌రే దాని రేంజ్ మార‌ట్లేదు. ఎవ‌రికి వారు త‌మ ట్యాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఇక శ్రీదేవీ డ్రామా కంపెనీ అయితే ప్రోమోలతోనే ఎక్కువగా అందరినీ దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఎమోషనల్‌గా సాగింది.

Rashmi
rashmi-ram-prasad-paradesi-torn-hyper-aadi-photo-in-sridevi-drama-company

బిగ్ బాస్ ఇంట్లో మాదిరిగానే ఈ ఎపిసోడ్ లో అక్క‌డున్న వారికి ఓ టాస్క్ ఇచ్చారు. ఎవ‌రైతే న‌చ్చ‌లేదో కార‌ణం చెప్పి వారి ఫొటోల‌ను చింపేయాలంటూ చెప్పుకొచ్చారు. ఇందులో మొద‌ట‌గా రాం ప్ర‌సాద్‌, ఆ త‌ర్వాత ప‌ర‌దేశి, ఆ త‌ర్వాత ర‌ష్‌మీ వ‌చ్చి ఆది ఫొటోల‌ను టార్గెట్ చేశారు. ఒక విష‌యంలో హర్ట్ అయ్యానంటూ రాం ప్ర‌సాద్‌, నాకు అన్నీ హైప‌ర్ ఆది అన్నే.. కాక‌పోతే ఒక విష‌యంలో అంటూ ప‌ర‌దేశి ఆది ఫొటోల‌ను కాల్చేశారు. దీంతో ఆది ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు.

చివర్లో రష్మీ వచ్చి మరో బాంబ్ పేల్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్‌లోకి వచ్చిన మొదటి రోజే.. ఆది తనను ఇలా అన్నాడంటూ.. ఎప్పుడొచ్చావని కాకుండా.. ఎప్పుడు వెళ్తావ్ అని అడిగాడంటూ అది తనకు నచ్చలేదని ఆది ఫోటోను రష్మీ కాల్చేసింది. దీంతో ఆది మరింతగా ఎమోషనల్ అయ్యాడు. మరి ఆది తన వంతు వచ్చినప్పుడు ఎవరి ఫోటోను కాల్చాడా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -