Renu Desai: పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. మళ్ళీ జానీ అనే సినిమాతో పవన్ కళ్యాణ్ తోనే నటించింది మూడేళ్ల తర్వాత వాళ్ళిద్దరికీ విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రేణు దేశాయ్ అప్పటినుంచి ఇప్పటివరకు మరి ఏ సినిమాలోని నటించలేదు.
తాజాగా విడుదలైన రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో నటించింది రేణు దేశాయ్. అయితే 20 ఏళ్లలో ఒక్కసారి కూడా నటించని రేణు దేశాయ్ గురించి ఈ మధ్యనే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. మహేష్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయినా మురారి సినిమా కోసం కృష్ణవంశీ హీరోయిన్ గా ముందు రేణు దేశాయిని అడిగారట.
కానీ రేణు దేశాయ్ రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ సోనాలి బింద్రేకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ రేణు దేశాయ్ ఈ సినిమాని ఎందుకు వద్దందో అనే విషయం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఈ సినిమానే కాదు దీని తర్వాత మహేష్ బాబుతో ఇంకో సినిమాలో కూడా ఆఫర్ వచ్చిందట కానీ మళ్ళీ రేణు దేశాయ్ రిజెక్ట్ చేసేసింది.
ఈ సినిమా ఏ కాకుండా మరి ఏ సినిమా జోలికి వెళ్ళని రేణు దేశాయ్ చాలా సంవత్సరాల తర్వాత టైగర్ నాగేశ్వరరావు తో వచ్చి హిట్టు కొట్టింది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు రవితేజ గారికి చాలా రుణపడి ఉంటాను, అవసరం ఉన్న సమయంలో నాకు మంచి ఆఫర్ని ఇచ్చారు. అని ఎమోషనల్ అవుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పీచ్ ఇచ్చింది రేణు దేశాయ్.