Sai Pallavi: బాలీవుడ్ సినిమాలంటే బికినీలు, చెడ్డీలు వేయాల్సిందే.. సాయిపల్లవి కూడా అవి చూపిస్తారా?

Sai Pallavi: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ సమయంలోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈమెకు యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. సాయి పల్లవిని అభిమానులు ముద్దుగా న్యాచురల్ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాగా తెలుగులో ఇప్పటివరకు సాయి పల్లవి ఫిదా, లవ్ స్టోరీ, ఎంసీఏ, ప్రేమమ్, పడి పడి లేచే మనసు, గార్గి, మారి, విరాటపర్వం లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. ఇక సాయి పల్లవి చివరిగా గార్గి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

దాదాపు ఏడాదిన్నర నుంచి సాయి పల్లవి ఎటువంటి సినిమాలు నటించకపోగా ఆమె సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్లు లేవు. దీంతో చాలా మంది అభిమానులు గతంలో ఆమె సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతోంది అంటూ వచ్చిన వార్తలు నిజమే అని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ కి ఊరటనిచ్చే ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఇప్పటివరకు టాలీవుడ్ తో పాటు మలయాళం, కోలీవుడ్ సినిమాలలో నటించిన సాయి పల్లవి బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతుందట. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైట్ కాంత్ త్వరలోనే తెరంగేట్రం చేయబోతున్నాడు. జూనైట్ నటిస్తున్న తొలి చిత్రం యాష్ ఫిల్మ్ నిర్మిస్తోంది.

అయితే ఈ సినిమా ఇంకా పూర్తవ్వకముందే ఆయన మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాని సునీల్ పాండే తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో సాయి పల్లవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి విషయంలో భయపడుతున్నారు. భయం ఎందుకంటే టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ ఒక్కసారిగా బాలీవుడ్ కి వెళ్లారు అంటే డ్రెస్సింగ్ స్టైల్ అది ఒకటి మారిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఎప్పుడైతే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తారో అప్పుడే హీరోయిన్స్ హద్దులు మీరి పోతారని, బాలీవుడ్ ప్రపంచం అంటే అలానే ఉంటుందని ఇప్పుడు హీరోయిన్ సాయి పల్లవి కూడా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుందని వార్తలు వినిపిస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాలీవుడ్ లో అన్ని బికినీలు చెడ్డీలు ఎక్కువగా వేస్తూ ఉంటారు ఇప్పుడు సాయి పల్లవి కూడా మనం అలాగే చూడాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -