Saitej: టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన విరూపాక్ష సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం సాయి ధరంతేజ్ చిత్ర బృందం సంతోషంగా ఉన్నారు. సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వరుస ఫ్లాప్ లతో సతమత అవుతున్న సాయి ధరమ్ తేజ్ కీ ఈ సినిమా మంచి సక్సెస్ ను తెచ్చి పెట్టింది. ఈ సినిమాతో పాటు సాయి తేజ్ పవన్ కళ్యాణ్ తో కలిసి వినోదయ సిత్తం రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏమైంది ఈ వేళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండో సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్ట్ ని చేసే ఛాన్స్ దక్కించుకున్న సంపత్ నంది. తరువాత రచ్చ సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటీమార్ సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు సంపత్ నంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం సంపత్ సాయితేజ్ తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
సాయి తేజ్, సంపత్ నంది కలయికలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారిక వెల్లడించనున్నారు చిత్ర బృందం. అంతే కాకుండా ఈ సినిమా జూన్ లేదా జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.