Samantha: వాటికి భయపడి సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉందా?

Samantha: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది.ఈమె నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ ఉంది.

ఇలా ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత పెద్ద ఎత్తున నేటిజెన్ల ట్రోలింగ్ కి గురయ్యేది. ఇకపోతే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య అభిమానులు సమంతను ఏదో ఒక విషయంలో భారీగా ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోయారు. ఈ విషయంలో సమంత మాత్రం వెనకడుగు వేయకుండా తనదైన శైలిలో సమాధానం చెబుతూ అందరిని నోరు మూయించింది.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సమంత హడావిడి కనిపించడం లేదని చెప్పాలి. సమంత సోషల్ మీడియా వేదికగా జూలై 21వ తేదీ పోస్ట్ చేశారు. అప్పటినుంచి ఈమె సోషల్ మీడియాకు దూరమయ్యారని చెప్పాలి.ఈ విధంగా ఈమె సోషల్ మీడియాకు దూరం కావడానికి గల కారణం ఏంటి అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమంత నేటిజన్లో ట్రోలింగ్ భరించలేక సోషల్ మీడియాకు దూరమైందని కొందరు భావిస్తున్నారు.

ఏది ఏమైనా సమంత ఇలా సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఈమె ప్రస్తుతం యశోద సినిమాతో పాటు విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈమె మొదటిసారిగా నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే త్వరలోనే ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -