Nandamuri: నందమూరి ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాక్.. మోక్షజ్ఞ సినిమాల్లోకి రాడా?

Nandamuri: ఇండస్ట్రీలో నటన వారసత్వం కొనసాగడం సర్వసాధారణం ఇప్పటికే బాలకృష్ణతో పాటు హీరోలుగా నటిస్తున్నటువంటి మోహన్ బాబు చిరంజీవి వంటి హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇక మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రాంచరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక బాలకృష్ణ వారసుడు ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇదిగో మోక్షజ్ఞ ఎంట్రీ..అదిగో వచ్చేస్తున్నాడు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నప్పటికి ఇప్పటివరకు ఈయన సినీ ఎంట్రీ గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇలా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి నందమూరి అభిమానులలో కాస్త ఆందోళన నెలకొంది. ఒక సామెత ఉంది గుర్రాన్ని బలవంతంగా నీటి వరకు తీసుకెళ్లొచ్చు గాని నీటిని తాగించలేము అని అయితే ఈ సామెత బాలకృష్ణ మోక్షజ్ఞకు పక్కాగా సరిపోతుందని పలువురు భావిస్తున్నారు.

 

వాస్తవానికి నటనపై మోక్షజ్ఞకు ఏమాత్రం ఆసక్తి లేదని సమాచారం. అయినప్పటికీ తన వారసత్వాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో బాలకృష్ణ తన కొడుకు విషయంలో బలవంతం చేస్తున్నాడని ఇండస్ట్రీ సమాచారం.ఈ విషయం గురించి తండ్రి కొడుకుల మధ్య గొడవలు కూడా జరిగాయని ఫైనల్ గా మోక్షజ్ఞ తను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారంటూ తెలుస్తోంది.

 

ఇలా నటన విషయంలో తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా బాలకృష్ణ బలవంతం చేస్తున్న నేపథ్యంలో మోక్షజ్ఞ ఈ విషయంలో తన తండ్రికి క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.బాలకృష్ణ భయపెట్టిన బ్రతిమిలాడిన తాను హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రసక్తే లేదని మోక్షజ్ఞ తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ఇక నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు అనే కల నుంచి బయటకు రావాలని,పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రారనే వార్త నందమూరి అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -