10th Student: టెన్త్ కుర్రాడి ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు?

10th Student: ప్రస్తుతం ఏపీలో బాపట్లలో జరిగిన టెన్త్ క్లాస్ విద్యార్థి హత్య కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు బాపట్లలో ఏం జరిగింది? ఆ విద్యార్థి ఎలా చనిపోయాడు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఏపీలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి పరిధిలోని ఉప్పలవారిపాలెం గ్రామంలో ఉప్పల అమర్ నాథ్ అనే 14 ఏళ్ళ బాలుడు నివసిస్తున్నాడు. అమర్ తండ్రి గతంలోనే మరణించాడు. దాంతో అప్పటి నుంచి తల్లి, సోదరితో పాటు తాత ఇంటి వద్దే ఉండి చదువుకుంటున్నాడు.

అమర్ నాథ్ స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉంటే, అమర్ నాథ్ అక్కను రాజోలు రెడ్లవారిపాలెనికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అమర్ నాథ్ ఇటీవల వెంకటేశ్వర్ రెడ్డికి అతని స్నేహితుల ముందే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ యువకుడు అమర్ నాథ్ పై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అమర్ నాథ్ ను చంపేయాలి అని అనుకున్నాడు. అనుకున్న ప్రకారం పథకం రచించాడు. ఇందులో భాగంగానే వెంకటేశ్వర్ రెడ్డి గురువారం ఒక బాటిల్ లో పెట్రోల్ తెచ్చి పెట్టుకున్నాడు. ఇక అమర్ నాథ్ ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 6 గంటలకు రాజోలుకు సైకిల్ పై ట్యూషన్ వెళ్తున్నాడు.

 

పక్కా ప్లాన్ తో వెళ్లిన వెంకటేశ్వర్ రెడ్డి సైకిల్ పై వచ్చిన అమర్ నాథ్ ను తన స్నేహితులతో కలిసి అడ్డగించాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక వడ్ల బస్తాల వెనకాలకు తీసుకెళ్లి అతడిని తీవ్రంగా కొట్టారు. అనంతంర తెచ్చిపెట్టుకున్న పెట్రోల్ ను వెంకటేశ్వర్ రెడ్డి అమర్ నాథ్ ఒంటిపై పోసి నిప్పటించాడు. దీంతో ఆ బాలుడు పూర్తిగా ఆ మంటల్లో కాలిపోయాడు. అయితే గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేసి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఏం జరిగిందంటూ అమర్ నాథ్ ను ప్రశ్నించగా చిల్లర కొట్టు అబ్బాయి వెంకీ అతని స్నేహితులతో కలిసి నన్ను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత నాపై పెట్రోల్ పోసి నిప్పటించారు అంటూ చివరి మాటలు చెప్పి మార్గమధ్యలోనే కన్నమూశాడు. దానిని వీడియో తీసుకుని వాట్సప్ లో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. కుమారుడి మరణవార్త తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై అమర్ నాథ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మరి కొందరు పరారీలో ఉన్న స్థానిక పోలీసులు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -