Shraddha Kapoor: నాలుగు కోట్ల కారు కొనుగోలు చేసిన స్టార్ హీరోయిన్.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Shraddha Kapoor: విజయదశమి రోజు శ్రద్ధ కపూర్ నాలుగు కోట్ల ఖరీదైన లంబోర్గిని కారు ని స్వయంగా డ్రైవ్ చేస్తూ ముంబై వీధుల్లో సందడి చేసింది. వేరెవరితో నడుపుతుంది అనుకునేరు.. ఎవరిదో అయితే న్యూస్ వైరల్ ఎందుకు అవుతుంది. స్వయంగా ఆమె నాలుగు కోట్లు పెట్టి కొనుక్కొని విజయదశమి సందర్భంగా బుధవారం నాడు స్వయంగా నడుపుకుంటూ వెళ్లి కారుకు ప్రత్యేక పూజలు చేయించింది. తర్వాత తన కలల కారును ముంబై వీధుల్లో నడుపుతూ ఎంజాయ్ చేసింది.

325 కేఎంపిహెచ్ వేగంతో నడిచే ఈ కారుతో 100 కిలోమీటర్ల లోపు గమ్యాలను 3.2 సెకండ్లలో చేరుకోవటం దీని ప్రత్యేకత. సీనియర్ నటుడు శక్తి కపూర్ నట వారసురాలిగా ఆషికి 2 సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రద్ధా కపూర్ ఆ సినిమా హిట్ తో తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్త్రీ, హైదర్, భాగి, ఏబిసిడి వంటి విజయవంతమైన చిత్రాలు చేస్తూ స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది.

బాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది. సాహో సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించి ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది శ్రద్ధా కపూర్. అయితే శ్రద్ధా కపూర్ ఈ కారు కొన్న విషయాన్ని ముంబైలోని లంబోర్గిని కార్లు అమ్మే పూజా చౌదరి ఈ విషయాన్ని తెలియజేసింది. నా ఫ్రెండ్ శ్రద్ధ కపూర్ కి లంబోర్గిని కార్ అమ్ముతున్నాను.

తనని మహిళలు స్ఫూర్తిగా తీసుకొని కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ శ్రద్ధా కపూర్, లంబోర్గిని కారుతో కలిసి తీసుకున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనితో ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఒక లేడీ లంబోర్గిని కారుని కొనటం ఇండియాలో ఇదే మొదటిసారి. ఇక సినిమాలు విషయానికి వస్తే ప్రస్తుతం శ్రద్ధా కపూర్ సూపర్ డూపర్ హిట్ విజయాన్ని సాధించిన స్త్రీ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న స్త్రీ 2లో నటిస్తున్నది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -