Soundarya: బాలయ్య పక్కన ఛాన్స్ వదులుకుని షాకిచ్చిన సౌందర్య.. అసలేం జరిగిందంటే?

Soundarya: టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ, దివంగత స్టార్ నటి సౌందర్య కాంబినేషన్ లో టాప్ హీరో అనే సినిమా అప్పట్లో విడుదల అయింది. ఈ సినిమాలోని పాటలు బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ ను సాధించలేకపోయింది. అయితే ఈ సినిమా తర్వాత మనలో మరోసారి సౌందర్య బాలకృష్ణ కాంబినేషన్లో నర్తనశాల సినిమా షూటింగ్ మొదలు పెట్టారట. ఆ సినిమాలో సౌందర్య ద్రౌపదిగా నటిస్తుంది. అయితే ఒక షెడ్యూల్ షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా అదే సమయంలో సౌందర్య ఫ్లైట్ ఆక్సిడెంట్ లో మరణించడంతో నర్తనశాల షూటింగ్ అక్కడే ఆపేశారు.

న‌ర్త‌న‌శాల‌ షూటింగ్ ఎక్కడ వరకు పూర్తయిందో అక్కడ వరకు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. అది కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇలాంటి సమయంలోనే సౌందర్య, బాలకృష్ణ కాంబోలో ఒక సూపర్ హిట్ మూవీ రావాల్సి ఉంది. కానీ ఆ సినిమాకు సౌందర్య నో చెప్పడంతో అక్కడితో ఆగిపోయింది. ఆ సినిమా మరేదో కాదు బాలయ్య వి.వి.వినాయక్ కాంబినేషన్లో వచ్చిన చెన్నకేశవరెడ్డి. ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా 2002లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చెన్నకేశవరెడ్డి సినిమాను ఇటీవలె మరోసారి రీ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

 

కాగా సినిమాల్లో ఒక హీరోయిన్‌గా సౌందర్య నటించాల్సి ఉంది. ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన బాలకృష్ణకు జంటగా సౌందర్యనే ముందుగా అనుకున్నారట. దర్శకుడు వివి వినాయ‌క్ సౌందర్యకు ఈ సినిమా స్టోరీ చెప్పడంతో కథ విన్న సౌందర్య వెంటనే నో చెప్పేసిందట. దానికి ముఖ్య కారణం బాలయ్య భార్య గానే కాకుండా త‌ల్లిగా కూడా నటించాల్సి ఉంది. అందుకే బాల‌య్య‌తో చ‌స్తే అలా చేయ్య‌న‌ని సౌంద‌ర్య తెగేసి చెప్పింద‌ట‌. కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న స‌మ‌యంలో తల్లిపాత్రలు చేస్తే ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తాయని సౌందర్య భావించిందట అందుకే ఆ సినిమాకు నో చెప్పిందట. దీంతో ఆ మాట‌కు డైరెక్ట‌ర్‌తో పాటు మేక‌ర్స్ కాస్త స్ట‌న్ అయ్యార‌ట‌. సౌంద‌ర్య బాల‌య్య ప‌క్క‌న ఛాన్స్ వ‌దులుకోవ‌డం ఏంట‌ని నోరెళ్ల బెట్టార‌ట‌. తర్వాత ఆ పాత్ర కోసం మరో సీనియర్ హీరోయిన్ టబును తీసుకున్నారట.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -