Mythri Movie Makers: మైత్రీ నిర్మాతకు అలాంటి సమస్య.. అయ్యో పాపం అంటూ?

Mythri Movie Makers: గత రెండు రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేర్లు దర్శకుడు సుకుమార్, నవీన్ యెర్నేని. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. రెండు మూడు రోజులుగా మైత్రి మూవీ భాగస్వాముల ఇళ్లపై ఆఫీసులపై ఇన్కమ్ టాక్స్ రైడ్స్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ఈ విషయం కాస్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇటువంటి సమయంలో యెర్నేని కాస్త నలతగానే వుంటున్నారని తెలుస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో ఈ రెయిడ్స్ జరగడంతో నవీన్ కాస్త టెన్షన్ కు గురయినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. నవీన్ అస్వస్థకు గురవడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఛాతీలో నొప్పిగా వుండడంతో నగరంలో ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో గుండె సంబంధిత పరీక్షలు అన్నీ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు డిశ్ఛార్జి చేస్తారనిసి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా యెర్నేని అమెరికాలో వుంటూ ఎనిమిదేళ్ల క్రితం తన మిత్రులు ఇద్దరితో కలిసి మైత్రీ మూవీస్ సంస్థను ప్రారంభించారు. భారీ బడ్జెట్ సినిమాలు, క్రేజీ కాంబినేషన్ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు.

పుష్ప సినిమాతో నేషనల్ లెవెల్ లో ఈ బ్యానర్ పేరు మారుమోగింది. పుష్ప సినిమాతో పాటు ఇప్పటివరకు పలు సినిమాలను ఈ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నవీన్ ఎర్నేని ఇంటితోపాటు, సుకుమార్ ఇంటిపై కూడా ఇన్కమ్ టాక్స్ అధికారులు రైడ్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇకపోతే దర్శకుడు సుకుమార్ విషయానికొస్తే ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు షూటింగ్ జరుగుతుండగా ఇలా ఇన్కమ్ టాక్స్ అధికారులు సుకుమార్ ఇల్లు ఆఫీసులపై దాడి చేయడంతో షూటింగ్ కు కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -