Hyderabad: భర్తను కాదని అతని స్నేహితుడి కోసం అలాంటి పని?

Hyderabad: ప్రస్తుత సమాజంలో చాలామంది వివాహతలు తాళి కట్టిన భర్తను కాదని పరాయి పురుషుల మోజులో పడి పచ్చని సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా పరాయి పురుషుల కోసం ఏకంగా తాళి కట్టిన భర్తలను చంపడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఈ ఘటనే హైదరాబాద్ పరిధిలోని జగద్గీరిగుట్టలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా మట్టం గ్రామానికి చెందిన జయకృష్ణ 36 ఏళ్ల వ్యక్తి అదే గ్రామానికి చెందిన దుర్గా భవానీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులు కొన్నాళ్ల పాటు మట్టం గ్రామంలోనే కాపురం పెట్టారు. ఇక కొన్నాళ్లకి ఆ భార్య భర్తలు అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి వలస వచ్చి జగద్గీరిగుట్ట పరిధిలోని ప్రసన్ననగర్ లో నివాసం ఉంటున్నారు. జయకృష్ణ ఆల్విన్ కాలనీలోనే జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు. దుర్గ భవానీ ఇంట్లోనే ఉండేది. ఇక ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా గడిపారు. ఇదిలా ఉంటే జయకృష్ణ స్నేహితుడైన చిన్నా అనే వ్యక్తి అప్పుడప్పుడు వీరి ఇంటికి వస్తూ ఉండేవాడు. వీరిద్దరూ మంచి స్నేహితులుగా కలిస ఉండేవారు. అయితే చిన్నా ఇంటికి వస్తున్న క్రమంలోనే దుర్గా భవానీ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

 

అలా తన భర్తకు తెలియకుండా వ్యవహారం అంతా నడిపించింది. ఆర్థిక ఇబ్బందులు తెలెత్తడంతో జయకృష్ణ 25 రోజుల క్రితం తన సొంత ఊరుకి వెళ్లాడు. హైదరాబాద్ లో ఉండడం వీలుకాకపోవడంతో అతడు సొంతూరికి వెళ్దామని భార్య దుర్గా భవానికి వివరించాడు. కానీ అందుకు భవాని మాత్రం నిరాకరించింది. దుర్గా భవాని ఇదే విషయాన్ని తన ప్రియుడు చిన్నాకు చెప్పగా, ఇక ఇద్దరు కలిసి జయకృష్ణను హత్య చేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నదే ఆలస్యం చిన్నా జయకృష్ణకు ఇటీవల ఫుల్ గా మద్యం తాగించాడు. అతడు మద్యం మత్తులోకి వెళ్లగానే జయకృష్ణ పై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఆ తర్వాత ఏం తెలియదన్నట్లుగా అప్పుల బాధతో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని దుర్గా భవాని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, ఎందుకు మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా భార్య దుర్గభ వాని, ఆమె ప్రియుడు చిన్నా ఇద్దరు కలిసి అతడిపై పెట్రోల్ పోసి హత్య చేశారని తేలింది. నిందితులు కూడా చేసిన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. .

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -