Taapsee: దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన చిత్రం ఝుమ్మంది నాదం ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నటి తాప్సీ. సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు అనంతరం తెలుగులో గోపీచంద్ రవితేజ ప్రభాస్ వంటి హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు.
ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ అక్కడ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమె సౌత్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు. అయితే సౌత్ సినిమాలలో నటించడం గురించి ఈమె ఇది వరకు పలు సందర్భాలలో తెలియచేశారు. సరైన కథ రాకపోవటం వల్లే నేను సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె టాలీవుడ్ హీరోల గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు తెలుగులో కమర్షియల్ హీరోల పక్కన నటించే అవకాశం వస్తే అసలు వదులుకోనని తెలిపారు. అయితే ఇప్పటివరకు నాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోల పక్కన నటించే అవకాశాలు రాలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ రవితేజ గోపీచంద్ వంటి హీరోల సరసన నటించారు.
ఈ క్రమంలోనే ఈమె నాకు కమర్షియల్ హీరోల పక్కన నటించే అవకాశాలు రాలేదు అంటే రవితేజ ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు కమర్షియల్ హీరోలు కాదా.. ఆమె ఉద్దేశంలో ఈ స్టార్ హీరోలు కమర్షియల్ హీరోలు కాదా అంటూ ప్రభాస్, రవితేజ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈమెను ట్రోల్స్ చేస్తున్నారు.