Tammareddy Bharadwaj: లైగర్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఎగిరెగిరి పడితే ఇలానే అంటూ?

Tammareddy Bharadwaj: టాలీవుడ్ ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్.. ఆ తర్వాత ద్వారకా సినిమాతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు. కానీ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి తో కుర్ర కారుని ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు.

ఆపై పలు సినిమాలో నటించి విజయ్ యూత్ ఐకాన్ గా మారాడు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా లైగర్. నిజానికి ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనుకోని రీతిలో ఓటమి పాలయ్యింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా గురించి ప్రేక్షకులు నెగిటివ్ గా మాట్లాడారు.

ఇక ఇదే నేపథ్యంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ ఓటమిపై కొన్ని ఆశ్చర్యమైన కామెంట్లు విసిరారు. మన యాక్షన్ ని బట్టి ప్రేక్షకుల రియాక్షన్ ఉంటుంది. ఎగిరెగిరి పడితే ఇలాంటివే ఎదురవుతాయి. సినిమా చూడండని ప్రమోట్ చేసుకోవాలి కానీ.. చిటికెలు వేస్తూ చెబితే ఇలానే బెడిసి కొడుతుంది. హీరోలు ఊరికే ఎగిరి పడడం కరెక్ట్ కాదు.

మన నోరు అదుపులో పెట్టుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రేక్షకులు ఇలానే తగలబెడతారు అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ కామెంట్లకు విజయ్ దేవరకొండ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి.

ఇక విజయ్ దేవరకొండ రాబోయే సినిమాల విషయానికొస్తే.. ఖుషి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాకు శివ నారాయణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -