Chiranjeevi: తమ్మారెడ్డి భరద్వాజ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారికి ఈయన బాగా సుపరిచితమే. ఇండస్ట్రీలో అలాగే సమాజంలో ఎటువంటి విషయాలు జరిగినా కూడా వెంటనే ఆ పరిణామాలపై స్పందిస్తూ కుండ బద్దలు కొట్టినట్టుగా ముక్కుసూటితనంగా మాట్లాడుతూ ఉంటారు తమ్మారెడ్డి భరద్వాజ. కాగా తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా కంటే కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారని చెప్పవచ్చు.
సెలబ్రిటీలపై కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా మాట్లాడుతూ తరచూ వార్తలు నిలుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ చిరంజీవిపై చిరంజీవి సినిమాలపై సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, చిరంజీవి, ఇలా హీరోలందరూ కెరీర్ మొదట్లో మెథడ్ యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది. చిరునే తీసుకోండి. శుభలేఖ, స్వయంకృషి, రుద్రవీణ, విజేత లాంటి సినిమాలకే అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. అమీర్ దంగల్ లాంటి సినిమా చిరంజీవి చేసినా జనాలు చూస్తారు.
భోళా శంకర్, గాడ్ ఫాదర్ లాంటివి చేసి డిసప్పాయింట్ కావడం కంటే నేచురల్ మూవీస్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ. ఈ విషయాన్ని నేను చిరంజీవితో కూడా చెబుదామని ప్రయత్నించాను. కానీ ఎందుకో కుదరలేదు. ఒకప్పటి సినిమాల్లో చిరంజీవిని చూస్తే మన ఇంట్లో మనిషిలా కనిపించేవారు. ఇప్పుడు ఆ చిరంజీవి మళ్లీ కనిపిస్తే చూడాలని ఉంది. అలానే సినిమాలు ఆడుతాయి అనేది నా నమ్మకం అని తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ. మరి ఇప్పటికైనా చిరంజీవిలో మార్పు వస్తుందో రాదో చూడాలి మరి..