Delhi: ఉద్యోగం ఇప్పిస్తే చంపేశాడు.. యువకుడి దారుణం

Delhi: పాలు పోసి పెంచి పామే కాటేసినట్లు తరహాలో నమ్ముకున్న వ్యక్తులే బరితెగిస్తున్నారు. ఆపదలో ఉన్న వ్యక్తులకు సహాయం చేస్తే.. చివరికి అలాంటి వాళ్లే మోసం చేస్తున్నారు. ఎవరిని అయితే నమ్ముతామే వాళ్లే మోసం చేస్తే ఆ బాధలను ఎవర తట్టుకోలేరు. తల్లి పాటు తాగి రొమ్ము గుద్దినట్లుగా వ్యవహరిస్తున్నారు కొంతమంది నమ్మకస్తులు. ఇప్పుడు అలాంటి వ్యవహారమే ఒకటి చోటుచేసుకుంది.

ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పొట్టకూటి కోసం ఊరికి వచ్చిన యువకుడికి ఓ పెద్ద మనిషి ఆశ్రయం కల్పించాడు. అతడికి ఉద్యోగం ఇప్పించడమే కాకుండా తన ఇంట్లోనే ఓ గదిని అద్దెకు ఇచ్చాడు. అయితే మద్యం మత్తులో సహాయం చేసిన ఇంటి ఓనర్ నే యువకుడు చంపేశాడు. అంతేకాకుండా శవంతో సెల్పీ తీసుకన్నాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు.

బిమార్ లోని సమస్ధిపుర్ జిల్లాకు చెంిన 25 ఏళ్ల పంకజ్ సాహ్ని మద్యానికి బానిస అయ్యాడు. భార్యతో విబేధాల కారణంగా ఇంటిని వదిలేసిన ఈ నెల తొలివారంలో ఢిల్లీకి వచ్చాడు. నార్త్ ఈస్ట్ ఢిల్లీకి చెందిన సురుష్ అనే వ్యక్తి అతడికి ఉద్యోగం ఇప్పించి తన ఇంట్లోనే అద్దెకు రూమ్ ఇచ్చాడు. ఆగస్టు 9న ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీంతో పంకజ్, సురేష్ మధ్య గొడవ జరిగింది. అయితే సురేష్ కు పంకజ్ కు క్షమాపణలు చెప్పడంతో. ఆ గొడవ అ్కడితో సద్దుమణిగింది. అది మనస్సులో పెట్టుకుని ఆగస్టు 10వ తేదీన మద్యం మత్తులో సురేష్ ను పంకజ్ హత్య చేశాడు.

ఇది గమనించిన సురేష్ కుమారుడు జగదీష్ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. హత్య చేసిన వెంటనే హర్యానా వెళ్లిన పంకజ్ ను పోలీసులు పట్టుకున్నారు. అతడు నిజం ఒప్పకోవడంతో కోర్టులో ప్రవేశపెట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -