Pooja Hegde: కూర్చొని చెప్పే అంత తీరిక లేదంటూ మండిపడిన నటి!

Pooja Hegde: అందాల నటి పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమా అవకాశాలు అందుకుంటుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ కిసి కా భాయ్‌ కిసి కా జాన్‌’ అనే సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాలో లో టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు. అలాగే జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా అందాల నటి పూజా హెగ్డే గురించి గత కొంతకాలంగా ఒక వార్త వైరల్ అవుతుంది. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే డేటింగ్ చేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ తో డేటింగ్ గురించి క్లారిటీ ఇచ్చింది. దీంతో పూజ హెగ్డే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాజాగా మీడియా ముందుకి వచ్చిన పూజ హెగ్డే కి సల్మాన్ ఖాన్ తో డేటింగ్ గురించి ప్రశ్న ఎదురవగా.. పూజా హెగ్డే స్పందించింది. ఈ క్రమంలో పూజ మాట్లాడారు..” ఆ విషయం గురించి ఏం చెప్పమంటారు. చాలా కాలంగా నా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సల్మాన్ ఖాన్ తో డేటింగ్ గురించి వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు అంటూ తెలిపింది.అంతేకాకుండా నేను ప్రస్తుతం సింగిల్ గా, నాతో నేను ప్రేమలో ఉన్నాననీ తెలిపారు.

ప్రస్తుతం నేను మనస్ఫూర్తిగా నా కెరీర్‌ మీద శ్రద్ధ పెట్టాను. షూటింగ్ వల్ల నేను ఒక సిటీ నుంచి మరొక సిటీకి గెంతుతూ ఉన్నాను. అందువల్ల ఇలాంటి ప్రశ్నలకు నేను కూర్చుని సమాధానం చెప్పలేను అంటూ తెలిపింది. ఇలా సల్మాన్ ఖాన్ తో డేటింగ్ గురించి పూజ హెగ్డే క్లారిటీ ఇచ్చింది. పూజా హెగ్డే ఇచ్చిన సమాధానంతో సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే డేటింగ్ గురించి వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది.ఇక గత ఏడాది పూజా ఏకంగా నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా నాలుగు సినిమాలు డిజాస్టర్ కావడంతో భారీ ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇలా సినిమాలు ఫ్లాపైన ఈమెకు వరుస అవకాశాలు రావడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -