Pooja Hegde: ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అందాల నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ టాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది. ఆ సినిమా హిట్ అవటంతో టాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు దక్కించుకొని వరుస హిట్లు అందుకుంది.
ఇలా కొంతకాలం టాలీవుడ్ లో వరుస హిట్లు అందుకున్న పూజా హెగ్డే గోల్డెన్ గా గుర్తింపు పొందినఈమెను అందరూ గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే గతేడాది ఈ అమ్మడికి అంతగా కలసి రాలేదు. పూజ నటించిన నాలుగు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. గతేడాది పూజా నటించిన ఆచార్య, బీస్ట్ వంటి సినిమాలతో పాటు మరో రెండు బాలీవుడ్ సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి.
పూజ హెగ్డే ఇప్పుడు ఐరన్ లెగ్గుగా మారిపోయింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఈ అమ్మడికి అవకాశాలు కూడా తక్కువయ్యాయి. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా తరువాత జనగణమన సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమాలో విజయ్ కి జోడిగా పూజా హెగ్డే నటించనున్నట్లు ప్రకటించారు. అయితే లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు.
ఈ సినిమా డిజాస్టర్ కావడంతో హీరో విజయ్ క్రేజ్ కూడా బాగా తగ్గిపోయింది. అందువల్ల జనగణమన సినిమా తీయటానికి మేకర్స్ వెనకడుగు వేయటంతో ఆ సినిమాకి బ్రేక్ పడింది. అందువల్ల ఆ సినిమాలో నటించే అవకాశం పూజ కి మిస్ అయ్యింది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవడంతో ఈ సినిమా నుండి పూజా హెగ్డే నే తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు రావడం కష్టమే అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు.