Pooja Hegde: సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. కెరియర్ మొదట్లో పలు డిజాస్టర్ సినిమాలలో నటించినప్పటికీ అనంతరమా అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అరవింద సమేత అలా వైకుంఠపురం వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఈమె స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు.
ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా వెళ్లారు అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు. అయితే ఒక బాలీవుడ్ హీరో మాత్రం ఈమెను దారుణంగా నమ్మించి మోసం చేశారట. మరి పూజ హెగ్డేను మోసం చేసినటువంటి హీరో ఎవరు అనే విషయానికి వస్తే…
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె తాజాగా సల్మాన్ ఖాన్ తో కలిసి కీసికా బాయ్ కిసి కీ జాన్ అనే చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమా షూటింగ్ టైంటో సల్మాన్ ఖాన్ తో ఎంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య కూడా ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే తో మాట్లాడుతూ నువ్వు బాలీవుడ్ మెటీరియల్ ఎన్ని రోజులనీ సౌత్ సినిమాలలో ఉంటావు ఇక్కడికి వచ్చేసేయ్ నేను చూసుకుంటానుగా అంటూ ఆమెకు మాట ఇచ్చారట.
ఇలా సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లను బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా చేసిన సంగతి తెలిసిందే. దీంతో పూజ హెగ్డే సైతం తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు కల్పిస్తారు అన్న కారణంతోనే ఈమె టాలీవుడ్ సినిమాలు ఒప్పుకొని మరి ఆ సినిమాల నుంచి తప్పుకున్నారట. అయితే అప్పుడు మాట ఇచ్చినటువంటి సల్మాన్ ఖాన్ ఇప్పుడు మాత్రం తనకు ఒక్క అవకాశం కూడా కల్పించలేకపోయారని కనీసం ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయని పరిస్థితులలో ఉన్నారని తెలుస్తోంది. బాలీవుడ్ వెళ్లాలన్న ఆశతో ఈమె ఇక్కడ కూడా సినిమా అవకాశాలను మిస్ చేసుకున్నారు.