CM KCR Grand Son: సీఎం కేసీఆర్ మనవడి మంచితనానికి ఫిదా కావాల్సిందే!

CM KCR Grand Son: కుల్వకుంట్ల వారి మూడవ తరం ప్రతినిధి కూడా ప్రజా జీవితంలోకి ఘనంగా ప్రవేశించిన విషయం అందరికీ తెలిసిందే. కల్వకుంట్ల చంద్రశేఖర రావు మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావు ఒక ఉన్నత పాఠశాల నిర్మాణ మరమ్మతులు తదితర పనులను తాను సేకరించిన విధులతో స్వయంగా పూర్తి చేయించి వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంతైనా కేసీఆర్ మనవడిని కదా ఏం చేయాలని అనుకున్నా సరే ఏదో ఒక రీతిగా చేసి ముగిద్దాం అనేది ఉండదు. చాలా పట్టుదలతో గొప్పగా చేయాలని అనిపిస్తుంది అందుకే ఈ పనిని కూడా ఇంత గ్రాండ్ గా చేశాను అని కల్వకుంట్ల హిమాన్షు రావు స్వయంగా చెప్పుకొచ్చారు.

పూర్తిగా దీనస్థితిలో ఉన్న గౌలిదొడ్డిలోని కేశవనగర్ పాఠశాలలో అమ్మాయిలకు మరుగుదొడ్లు సహా అనేక నిర్మాణ కార్యక్రమాలను హిమాన్షు తాను నిర్వహించిన రెండు ఈవెంట్ల ద్వారా సంపాదించిన సొమ్ముతో నిర్మించారు. ఇక్కడ అమ్మాయిలకు బాత్ రూములు కూడా లేకపోవడం చూసి, మొదటిసారి ఈ బడికి వచ్చినప్పుడు నా కళ్లమ్మట నీళ్లు వచ్చాయి అని హిమాన్షు తనలోని మానవీయ కోణాన్ని నలుగురికీ పరిచయం చేసుకున్నారు. రెండు ఈవెంట్స్ ద్వారా తాము 40 లక్షలు సేకరించామని, సీఎస్ఆర్ ఫండ్స్ కింద మధుసూదన్ సహకరించారని తెలిపారు.

 

స్కూలుకు మంచి చేయాలని అనుకోవడం వెనుక తనకు తాత కేసీఆర్ స్ఫూర్తి ఉన్నదని వెల్లడించారు హిమాన్షు. భారాస రూపంలో దేశవ్యాప్తంగా పెద్దఅడుగులు వేస్తూ విస్తరించాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర రాజకీయం మొత్తానికి కల్వకుంట్ల తారకరామారావు ఒక్కరే కేంద్రబిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మూడో తరం ప్రతినిధిగా కల్వకుంట్ల హిమాన్షు రావు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -