Balayya: నటరత్న నందమూరి బాలకృష్ణ యమజోరు మీద ఉన్నాడు. అఖండ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో దూసుకువెళ్తున్నాడు. తాజాగా నటసింహం నటించిన వీరసింహారెడ్డి సినిమాకు క్రాక్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం గ్రాండ్ గా ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది.
ఇక ఈ ఈవెంట్లో రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్.. రికార్డులు సృష్టిస్తుంది. ట్రైలర్లో బాలయ్య బాబు చూపిన డైలాగ్స్ ఫ్యాన్స్కు కిక్ ఎక్కిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈవెంట్ వేదికపై బాలయ్య మాట్లాడిన తీరు అయన ఫ్యాన్స్ తో పాటు సినీ జనాలను ఆకట్టుకుంది. ఎపుడు లేని విధంగా మంచి హుషారు మీద బాలయ్య కనిపించాడు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అభిమానులను విపరీతంగా అలరించింది. ఫైనల్ గా వేదిక మీద బాలకృష్ణ మాట్లాడిన తీరు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఆయన పలికిన డైలాగ్స్ ఫ్యాన్స్కు పూనకాలు తెపించింది.
ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ నటించింది. మూవీ డైరెక్టర్ గోపీచంద్ కు శృతి లక్కీ హీరోయిన్ గా మారింది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే మరోసారి శృతినే బాలయ్య బాబుకు జంటగా డైరెక్టర్ తీసుకున్నాడు.
అయితే ఈ మూవీలో మొదటగా బాలయ్య లక్కీ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతారను హీరోయిన్ గా తీస్కోవాలి అనుకున్నారు. కానీ నయన్ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ సినిమా చేయను అని చూపినట్టు ఫిలిం నగర్ భోగట్టా. దీంతో బాలకృష్ణ నయన్ విషయంలో కాస్త హర్ట్ అయినట్టు సమాచారం. అదేకాని నయన్- బాలయ్య ఈ మూవీలో నటించి ఉంటె సినిమాకు మరింత హైప్ వచ్చేది.