Priyamani: ప్రియమణికి ఇలా కావటానికి కారణం ఆ టాలీవుడ్ హీరోలే!

Priyamani: ప్రియమణి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పెళ్లయిన కొత్తలో సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. అప్పటి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది ఈ అమ్మడు. అనంతరం పలువురు స్టార్ హీరోల సరసన నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ఇక ప్రియమైన తన అందంతో అడపా దడపా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ప్రియమణికి యమదొంగ సినిమా అప్పట్లో మంచి పాపులారిటీని సంపాదించి పెట్టింది. అనంతరం ప్రియమణి మంచి మంచి సినీ ఆఫర్లు తన సొంతం చేసుకుంది. అప్పట్లో చారులత సినిమాకి ప్రేక్షకుల ప్రశంసలు తన సొంతం చేసుకుంది. ఇలా ప్రియమణి కెరియర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలో ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుంది.

అప్పటినుంచి ప్రియమణి సినీ ఆఫర్లు విషయంలో పూర్తిగా డౌన్ అయిందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఈ అమ్మడు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగింది. ఇటీవల వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమాలో మెయిన్ రోల్ చేసింది. ఈ సినిమాలో ప్రియమణి నటనకు ప్రేక్షకులు మరో స్థాయిలో ఫిదా అయ్యారు. కానీ క్రెడిట్ మొత్తం వెంకటేష్ కి దక్కింది. దాంతో ఈ అమ్మడు ఏమాత్రం లాభపడలేదు అన్నట్లు తెలుస్తుంది.

ఇక ఇటీవల టాలీవుడ్లో మళ్లీ హీరోయిన్ రీ ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్, రానా లా సినిమా కాబట్టి అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. కాబట్టి ప్రియమణి కూడా అంచనాలు మరో స్థాయిలో పెట్టుకొని.. ఈ సినిమాలో చేయడానికి ఇష్టపడింది. కానీ ప్రియమణికి దగ్గుపాటి సినిమాలు ఏమాత్రం కలిసి రాలేదు. విరాటపర్వం సినిమా పూర్తిగా డిజాస్టర్ గా నిలిచింది.

దాంతో ప్రియమణికి సినీ ఆఫర్లు ఇప్పటివరకు రాలేదు. ఇది గమనించిన కొందరు దగ్గుపాటి ఫ్యామిలీనే.. ప్రియ మణికి కెరీర్ పరంగా దెబ్బ వేశారా.. అన్నట్లు ఆలోచిస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రియమణి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ ఫోటోలతో నెట్టింట్లో తెగ హడావిడి చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -