Rana-Chiranjeevi: రానాకి బాహుబలి సినిమా ఏ రేంజ్ లో హిట్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఇందులో బళ్లాల దేవుడిగా విలనిజాన్ని ఒక రేంజ్ లో పండించాడు రాణా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా అదే రేంజ్ విలనిజాన్ని పండించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. అయితే ఇప్పుడు అదే తరహాలో మరొక స్టార్ హీరో సినిమాలో విలనిజాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఆయన కెరియర్ లో 156వ మూవీ తాజాగా గ్రాండ్ లెవెల్ లో పూజ కార్యక్రమాలతో మొదలైన విషయం తెలిసిందే. యూవి క్రియేషన్స్ సంస్థపై భారీ స్థాయిలో వంశీ, ప్రమోద్ నిర్మించబోతున్నారు. ఈ మూవీ సోషియో ఫాంటసీ తరహాలో రూపొందుతుంది అని సమాచారం. సంగీతాన్ని కీరవాణి అందిస్తే, చోటా కె నాయుడు ఫోటోగ్రఫీని అందించనున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు. అనుష్క శెట్టి, మృనాళ్ ఠాకూర్ ఇప్పటికే ఖరారు అయ్యారు. అయితే మూడో హీరోయిన్ కోసం పరిశీలిస్తున్నారు. కూతురి కోసం తండ్రి మూడు లోకాలని చుట్టివచ్చే కథగా ఈ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం. ఈ ప్రయాణంలో చిరంజీవిని ముప్పతిప్పలు పెట్టి చిత్రహింసలకు గురి చేసే విలన్ పాత్రలో దగ్గుబాటి రానా కనిపించబోతున్నట్లు సమాచారం.
రీసెంట్ గా రాణా ని కలిసి స్టోరీని, అందులో తన పాత్రని వివరించాడట వశిష్ట. వెంటనే ఇంప్రెస్స్ అయినా రాణా భళ్లాల దేవ కంటే పవర్ఫుల్ గా ఉంటుంది ఈ పాత్ర, నేనే చేస్తాను అంటూ వెంటనే కమిట్ అయిపోయాడట. ఈ సినిమా చిరంజీవికి 156 సినిమా, దసరా రోజున పూజ కార్యక్రమం నిర్వహించి ఆ వీడియోను కూడా టీం విడుదల చేసింది. చిరంజీవి యు వి క్రియేషన్స్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.