Ram Charan: స్టార్ హీరో రామ్ చరణ్ కు సైమా అవార్డ్ రాకపోవడానికి అదే కారణమా.. అక్కడే తప్పు జరిగిందా?

Ram Charan: ఈ మధ్యనే దుబాయిలో 2023 సైమా అవార్డ్స్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. రెండు రోజులపాటు జరిగిన ఈ అవార్డు ఫంక్షన్ లో ముందు రోజు తెలుగు, కన్నడ సినిమాలకి సంబంధించిన అవార్డు ఫంక్షన్ జరగగా మరుసటి రోజు తమిళ, మలయాళీ సినిమాలకు సంబంధించిన అవార్డు ఫంక్షన్ జరిగింది. అయితే మన తెలుగులో ఉత్తమ నటుడు క్యాటగిరిలో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి అందుకున్నాడు.

రెడ్ కార్పెట్ మీద నడిచి వెళ్తున్న ఎన్టీఆర్ ని చూసి అక్కడ ప్రేక్షకులు జై ఎన్టీఆర్ దగ్గర్నుంచి సీఎం ఎన్టీఆర్ అనే నినాదం అనడం ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అలాగే స్టేజ్ మీద ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ కూడా అంతే వైరల్ అయింది. అయితే ఇదంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగ. అయితే మరి రాంచరణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఏమాత్రం నచ్చలేదు. సినిమా అంత హిట్ అయింది అంటే అందుకు ఎన్టీఆర్ పాత్ర ఎంత ఉందో రాంచరణ్ పాత్ర కూడా అంతే ఉంది. నటనలో ఇద్దరు ఒకరిని ఒకరు మించి నటించారు.

అలాంటప్పుడు రాంచరణ్ కి అవార్డు ఇవ్వకపోవడంపై సైమా నిర్వాహకులపై మండిపడుతున్నారు చరణ్ ఫ్యాన్స్. ఇదే విషయంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చరణ్ ఫాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరుగుతుంది. అయితే అసలు విషయం ఏమిటంటే రామ్ చరణ్ కి కూడా ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఇదే విషయాన్ని నిర్వాహకులు రామ్ చరణ్ కి తెలియజేశారు. అయితే రామ్ చరణ్ ఆ సమయానికి జ్వరంతో బాధపడుతున్నాడు.

శంకర్ తో తను తీస్తున్న సినిమా షూటింగ్ కూడా ఆపివేసి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. దుబాయ్ వెళ్లే ఓపిక లేకపోవడంతో అదే విషయాన్ని సైమా నిర్వాహకులకు తెలియజేశాడు. దాంతో అవార్డుని ఎన్టీఆర్ కి ఇస్తున్నట్లు ప్రకటించారు సైమా నిర్వాహకులు. అంతేకానీ ఇక్కడ రామ్ చరణ్ కి జరిగిన అన్యాయం ఏమీ లేదు. ఆ విషయం ఫాన్స్ అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -