Sr NTR: ఆ స్టార్ హీరోయిన్ ను లాగిపెట్టి కొట్టిన ఎన్టీఆర్.. రీజన్ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Sr NTR: తెలుగు కళామతల్లికి నాగేశ్వరరావు, రామారావు రెండు కళ్ళు వంటి వారు అనేవారు అప్పట్లో. అందులో ఎన్టీ రామారావు విషయానికి వస్తే ఈయన ఎన్నో సాంఘిక, పౌరాణిక,జానపద చిత్రాలను తెరకెక్కించి రాముడంటే ఎన్టీ రామారావు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు అనే స్టేజ్ కి ప్రేక్షకులని తీసుకువచ్చేసారు. చాలామంది రాముడు కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు ఫొటోకే పూజలు చేసేవారు ఆ రోజుల్లో.

అంతటి పాపులారిటీ తెచ్చుకున్న నటుడు ఎన్టీఆర్. ఈయన తన తోటి నటీనటుల పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించేవారు. వారి కష్టసుఖాలలో కూడా పాలు పంచుకునేవారు. అవసరమైతే సలహాలు ఇచ్చేవారు. అలాంటి మన ఎన్టీఆర్ కి ఒకానొక దశలో మహానటి సావిత్రి మీద చెయ్యెత్తి కొట్టాలి అనిపించే అంత కోపం వచ్చేసిందట. దానికి కారణం కూడా లేకపోలేదు.

ఎందుకంటే సావిత్రి కెరియర్లో ఉన్నత శిఖరాలని అధిరోహిస్తున్న సమయంలో జెమినీ గణేషన్ ని పెళ్లి చేసుకుంది. అయితే తనకి ఎంతో సాన్నిహిత్యం ఉన్న సావిత్రి తనకి చెప్పకుండా పెళ్లి చేసుకోవటంతో పాటు తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుందనే బాధ ఎన్టీఆర్ కి కలిగిందట. అయితే ఒకానొక దశలో జెమినీ గణేషన్ గురించి తెలుసుకున్న సావిత్రి తను చేసిన పొరపాటు తెలుసుకొని భరించలేని బాధలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట.

అప్పుడు ఎన్టీఆర్ కోపంగా ఆమె దగ్గరికి వెళ్లి చేయెత్తి కొట్టాలి అనుకున్నాడట. కానీ మళ్ళీ ఆమె మీద ఉన్న గౌరవంతో ఆ పని చేయకుండా ఆమెకి జీవిత సత్యాలు బోధించి ఎలా జీవించాలో అని నాలుగు మంచి మాటలు చెప్పాడట మన సీనియర్ ఎన్టీఆర్. అప్పటినుంచి సావిత్రి రియాలిటీ లోకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిందని అప్పట్లో అనుకునేవారు. పాపం సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె తన కెరీర్ ని నిలబెట్టుకోలేకపోయింది. వ్యసనాలకి బానిసాయి ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోయింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -