Mahesh Babu: మహేష్ బాబుపై కుట్ర జరిగిన రెండు ప్రాంతాలు ఇవే.. ఏమైందంటే?

Mahesh Babu: త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ తో ఈ సినిమా రావటం వలన సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ విడుదలైన తరువాత సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

అయితే సినిమా విడుదలైన తరువాత ఆ అంచనాలను అందుకోలేకపోయింది గుంటూరు కారం. మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. అలాగే బుక్ మై షో లో రేటింగ్ కూడా చాలా తక్కువ రావడంతో కావాలని బుక్ మై షో ఈ విధంగా చేస్తుందని ఆ సంస్థ పై కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు గుంటూరు కారం మూవీ మేకర్స్. బుక్ మై షో అనేది సినిమా టికెట్ బుకింగ్స్ లోనే అతిపెద్ద ప్లాట్ఫారం దీని మీద గుంటూరు కారం కంప్లైంట్ ఫైల్ చేసిందట.

 

బుక్ మై షో లో మోసపూరిత కార్యక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొంది మూవీ టీం.గుంటూరు కారం మూవీకి మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి ఎంత చెత్త సినిమా కైనా ఏడుకు పైగా రేటింగ్ వస్తుంది కానీ గుంటూరు కారం సినిమాకి 6.7 మాత్రమే రేటింగ్ వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అలాగే అనేక అనుమానాలకి కూడా దారితీసింది ఏదో కుట్ర జరిగిందని భావించిన మూవీ టీం సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేశారు.

 

విచారణ చేపట్టిన పోలీసులు బెంగళూరు నరసరావుపేట నుంచి ప్రధానంగా ఈ స్కామ్ జరిగిందని గుర్తించారు. సుమారు 15 వేల అకౌంట్ యూజర్లు జీరో రేటింగ్ వేసినట్లు తెలుస్తుంది. వాళ్ళు పని కట్టుకొని ఈ పని చేశారు. 15 వేల యూసర్లు జీరో రేటింగ్ వేయడంతో ఓవరాల్ గా రేటింగ్ పడిపోతుంది. గుంటూరు కారం సినిమాకి రేటింగ్ అందుకే పడిపోయింది అయితే ఇలా ఎందుకు చేశారు ఎవరు చేశారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -