Mega Daughters In Law : టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని వివాహం చేసుకోబోతోంది. వీరిది ప్రేమ వివాహం అన్న విషయం కూడా మనందరికి తెలిసిందే. త్వరలోనే ఈ జంట వివాహం గ్రాండ్గా జరగమంది. వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది. కాగా ఇటీవలే నాగబాబు నివాసంలో అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు బంధువుల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 1న వివాహం జరగనుంది.
ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. రామ్ చరణ్,ఉపాసన దంపతులు ఇప్పటికే ఇటలీకి చేరుకున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే సురేఖ – ఉపాసన, లావణ్యల మధ్య ఉన్న కామన్ పాయింట్ బయటపడింది. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ హెల్పింగ్ నేచర్లో ఎప్పుడు ముందుంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా హెల్ప్ చేసే మనస్తత్వం కలది. ఎన్ని సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే లావణ్యకి కూడా అదే అలవాటు ఉందట.
తన దగ్గర ఉన్నదానితో 50% ప్రజలకే పంచుతుందట. బయటకు చెప్పుకోదు కానీ లావణ్య కూడా ప్రజాసేవ అంటే చాలా చాలా ఇష్టం అంటూ చేసిన పనుల ద్వారా తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మంచిదే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సందర్భాలలో లావణ్య త్రిపాఠి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంది. కానీ ఈ విషయం బయటకు తెలియకుండా పబ్లిసిటీ కాకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది.