Balayya-Tarak: బాలయ్య, తారక్ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఇదే!

Balayya-Tarak: నందమూరి వంశం నుంచి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వరుస విజయాలతో స్టార్ హీరోల రేసులో ఉన్నారు. బాలయ్య తన సినిమాల్లో పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఏ హీరో ఫ్యాన్ అయినా సరే జై బాలయ్య అని అనాల్సిందే. ఆ ఊత పదం ఇప్పుడు అందరి నోళ్లలో మెదులుతోంది. సింహా సినిమాలో ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగులు, అలాగే గతంలో కూడా చాలా సినిమాల్లో ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికే వాడుకలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

 

బాలయ్య తర్వాత ఆ స్టామినాతో డైలాగ్ చెప్పే స్థాయి జూనియర్ ఎన్టీఆర్ కే ఉంది. తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాలో తన నటనతో అందర్నీ మెస్మరైజ్ చేశాడు. కొమురం భీముడో సాంగ్ లో అయితే ఆయన ఎక్స్ ప్రెషన్లు అద్భుతం అని చెప్పాలి. గోండు జాతి యోధుడిగా ఆయన పోరాటాలు ఆ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇకపోతే అటు బాబాయ్, ఇటు అబ్బాయ్ ఇద్దరూ ఇండస్ట్రీలో తమ సత్తాను చూపిస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు.

 

బాలయ్యకు, తారక్ కు ఓ పోలిక ఉంది. వీరిద్దరూ డైలాగ్ చెప్పడంలో ఒక కిక్కు ఉంది. వారి ఎక్స్ ప్రెషన్లను ఆ సమయంలో గమనిస్తే ఒకేలా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా ఈవెంట్ లో పాల్గొంటే ఆ సమయంలో తాము చెప్పిన డైలాగ్స్ స్క్రీన్ పై కనిపిస్తే నోట్లోంచి అవే డైలాగ్స్ చెబుతూ ఎక్స్ ప్రెషన్లు ఇస్తారు.

 

ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్న కామన్ పాయింట్ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాధారణంగా సినిమా ఈవెంట్లలో డైలాగ్స్ చెప్పి అందర్నీ ఉత్సాహపరచడం వంటివి ఈ ఇద్దరు హీరోలు చేస్తారు. ఆ సమయంలో వారిని గమనించినట్లైతే వారు ఇద్దరూ కూడా ఒకేలా హావభావాలు పలుకుతారు. ఇదే వారిలో కామన్ పాయింట్ అని ఫ్యాన్స్ కూడా అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -