Yatra 2: మొత్తం ఎమ్మెల్యేలలో యాత్ర2 చూసిన ఎమ్మెల్యేల కౌంట్ ఇదే!

Yatra 2: సొంతపార్టీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సినిమా చూపించారు. సినిమా చూపించారంటే.. ఇదేదో పొలిటికల్ సెటైర్ అనుకోవద్దు. నిజంగానే సినిమా చూపించారు. వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర2 సినిమాను వైసీపీ ఎమ్మెల్యేలు చూశారు. సినిమా గురువారం రిలీజ్ అయితే.. రిలీజ్ కు ముందు రోజు రాత్రి విజయవాడలోని కళానగర్ ఏరియాలో కల ట్రెండ్ సెట్ మాల్లో కాపిటల్ సినిమాస్ స్క్రీన్లలో యాత్ర2 సినిమాను వైసీపీ ఎమ్మెల్యేలు చూశారు. దీనిపై ఎవరి రివ్యూలు వాళ్లు ఇచ్చారు. అదేదో సినిమాలో దారులు వేరైనా గమ్యం ఒక్కటే అన్నట్టు.. చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు కానీ.. అందరి రివ్యూ ఒకటే.. సినిమా అద్భుతం.. సూపర్ హిట్, బంపర్ హిట్.. జగన్ పాత్ర కంట్లో నీళ్లు తెప్పించిందని చెప్పేశారు. చెప్పింది వైసీపీ ఎమ్మెల్యేలు కనుక అంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేం. రివ్యూ నెగటివ్ వస్తుందని కూడా అనుకోలేం.

 

అయితే, ఇదంతా పక్కన పెడితే.. వైసీపీకి మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ, ఈ సినిమా చూడటానికి వెళ్లింది జస్ట్ 60 మంది. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు మిగిలన 90 మంది ఎమ్మెల్యేలు ఎందుకు హాజరుకాలేదనే చర్చ నడుస్తోంది. అసలే అధిష్టానంపై పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారనే చర్చ నేపథ్యంలో ఇది మరో రచ్చకు దారి తీస్తోంది. టికెట్ల కేటాయింపు తర్వాత పార్టీలో గందరగోళ పరిస్తితులు మొదలైయ్యాయి. ఎవరు ఉంటారో.. ఎవరు పోతారో తెలియని పరిస్తితి ఏర్పడింది. టికెట్ దక్కని వారంత పక్కచూపులు చూస్తున్నట్టు ప్రచారం జరుతోంది. కొంతమంది ఇప్పటికే.. వైసీపీని వీడి పక్క పార్టీల్లో చేరారు. అయితే, ఇలా పార్టీలు మారిన వారు, పార్టీ మారుతారనే చర్చలో ఉన్నవారు 10 మంది కంటే ఎక్కువగా లేరు. కానీ.. సినిమాకు 60 మంది మాత్రమే హాజరుకాకపోవడంతో పెద్ద దుమారమే రేగుతోంది. దీంతో మరిన్ని రాజకీయ ఊహాగనాలకు తావిచ్చినట్టైంది.

వైసీపీలో బయటకు కనిపించే అసంతృప్తి కంటే.. లోలోపల ఉన్న అసంతృప్తి చాలానే ఉందని చర్చ నడుస్తోంది. దానికి నిదర్శనం యాత్ర2 అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సినిమాకు ఎవరైతే వెళ్లారో వారే పార్టీని అంటిపెట్టుకొని ఉంటారని.. మిగిలిన వారు అదును చూసుకొని కండువా మార్చేస్తారని అనుకుంటున్నారు. టికెట్లు కేటాయింపు పూర్తి అయ్యేసరికి నెమ్మదిగా అందరూ వైసీపీకి గుడ్ బై చెబుతారని చర్చ నడుస్తోంది. ఈ 60 మందికి జగన్ సినిమా చూపిస్తే .. మిగిలిన 90 మంది జగన్ కు సినిమా చూపిస్తారని ఇప్పటికే టీడీపీ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -