Anchor Anasuya: న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించిన అనసూయ జబర్దస్త్ షోతో యాంకర్గా పరిచయమైంది. ఈ షోతో అనసూయకు మంచి గుర్తింపు లభించింది. ఒకప్పుడు యాంకరింగ్ అంటే గ్లామర్తో సంబంధం లేకుండా ఉండేది. కానీ అనుసూయ తన యాంకరింగ్లో మసాలా డోస్ పెంచేసింది. ప్రేక్షకులకు తన మోడ్రన్ అందాల రుచి చూపించింది. యాంకరింగ్తోపాటు తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటోంది. ఈ భామ బుల్లితెరపై సందడి చేస్తూనే వెండితెరపై హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మ అత్త క్యారెక్టర్ చేసింది. ఈ పాత్రకు మంచి క్రేజ్ సంపాదించుకుంది. విమర్శకులను మెప్పించగలిగింది.
అలాగే పుష్ప సినిమాలో మంగళం శ్రీను భార్యగా, ఖిలాడీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలా అనసూయ ఎప్పుడూ తన షెడ్యూల్ బిజీగా ఉండేలా చూసుకుంటోంది. తనకు సంబంధించిన డైలీ అప్డేట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. వాటికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ సినిమాపై కామెంట్ చేసినందుకు అనసూయను ఆంటీ అంటూ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు.
సాధారణంగా ఇండస్ట్రీకి పెళ్లి కానీ వారు ఎక్కువగా వస్తుంటారు. కానీ ఈ భామ పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నాసరే తన అందాలను మాత్రం అస్సలు దాచుకోకుండా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ భామ కొద్దిరోజుల క్రితమే జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత స్టార్ మాలో ప్రసారమైన సూపర్ సింగర్స్ షోకి సుధీర్తో కలిసి యాంకరింగ్ చేసింది. ఈ షో అయిపోయాక అనసూయ బుల్లితెరపై ఎక్కడా కనిపించలేదు. ఈ భామ వెండితెరపై పలు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.
బుల్లితెర యాంకర్ అనసూయ షోలకు దూరంగా ఉంటూ వెండితెరకు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ నటించిన తర్వాత ఆమెకు భారీగా అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం అనసూయకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఆమె ఎద భాగాలపై ఓ టాటూ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే అది ఎవరి పేరో కాదు.. తన భర్త సుశాంక్ భరద్వాజ్ పేరును చిన్నగా రాయించుకుంది.