Surya Mantra: అన్ని వ్యాధులకు చెక్ పెట్టే సూర్య మంత్రం ఇదే.. ఆ సమస్యలు తీరతాయా?

Surya Mantra: ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని తమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తుంటారు. ఏ ఒక్కరు కూడా తమ ఆరోగ్యం క్షీణించుకోవాలని ఎవరు కోరుకోరు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడిని స్మరించే సమయంలో తమ ఆరోగ్యం తమ పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలని ప్రార్థిస్తుంటారు.అయితే ఇలా మన ఆరోగ్యం బాగుండాలి అంటే సూర్యదేవుడికి నమస్కారం చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ సూర్య మంత్రాన్ని చదవాలి.

ఈ విధంగా సూర్య దేవుడిని నమస్కరించుకున్న వారితో పోలిస్తే ఇతరులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలలో తెలిపారు.మనకు సూర్యుడి నుంచి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది తద్వారా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే ఇలా సూర్య దేవుడిని నమస్కరిస్తూ సూర్య మంత్రాన్ని చదవటం వల్ల మనకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు.

 

మరి సూర్య దేవుడిని నమస్కరించే సమయంలో ఏ విధమైనటువంటి మంత్రాన్ని చదవాలి అనే విషయానికి వస్తే.. నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారణే ఆయురారోగ్య మైశ్వర్యం దేహి దేవిః.. అని రోజూ సూర్య మంత్రాన్ని చదవటం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరవు. ఇక ఈ మంత్రానికి గల భావం ఏంటి అనే విషయానికి వస్తే..

 

ఓ సూర్య దేవా! జగత్ పరిపాలికా! నీకు ఇదే నా నమస్కారములు. నీవు సర్వ లోకములను తొలగించు వాడ‌వు. శాంతిని ఇచ్చేవాడివి. నువ్వు మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము.. అని అర్థం ఉంటుంది అందుకే తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం సూర్యదేవుడికి నమస్కరించుకుని ఈ మంత్రాన్ని చదవటం వల్ల సంపద పెరగడమే కాకుండా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోగలము.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -