Tollywood Celebrities: ఒకటి కావాల్సిన సెలబ్రిటీలు విడిపోవడానికి కారణాలు ఏంటో తెలుసా?

Tollywood Celebrities: ప్రతి ఒక్కరి జీవితంలోనూ వివాహం అనేది ఓ ముఖ్యమైన ఘట్టం. అయితే వివాహమే జీవితం కాదని చెప్పాలి. ఇలా ఎంతో ముఖ్యమైన ఈ వేడుకను ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెళ్లి చేసుకుంటారు. కొందరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోగా మరికొందరు పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పాలి.

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాల్సిన కొన్ని జంటలు కొన్ని కారణాల వల్ల చివరికి విడిపోతూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో ప్రేమించుకుని పెళ్లి పీటల వరకు వెళ్లి విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయని చెప్పాలి. అలాంటి వారిలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మరి వారెవరో తెలుసుకుందాం..

తరుణ్ -ఆర్తి అగర్వాల్ : నువ్వు లేక నేను లేను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరుణ్ ఆర్తి అగర్వాల్ ఈ సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అనంతరం ఈ జంట మరో రెండు మూడు సినిమాలలో నటించారు.ఈ క్రమంలోని వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలియడంతో వీరి ప్రేమకు పెద్దలు అడ్డుపడ్డారు దీంతో ఆర్తి అగర్వాల్ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని స్థిరపడగా తరుణ్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయారు. వివాహమనంతరం ఆర్తి అగర్వాల్ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.

ఉదయ్ కిరణ్ -సుస్మిత: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.ఇలా ఉదయ్ కిరణ్ ఎదుగుదలను చూసిన మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కుమార్తె సుస్మితను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే వీరు నిశ్చితార్థాన్ని కూడా ఎంతో ఘనంగా జరిపారు.అయితే కొన్ని కారణాల వల్ల వీరి వివాహం రద్దు కావడం అనంతరం ఉదయ్ కిరణ్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని సినిమా అవకాశాలు లేక అధిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుని మరణించారు.

విశాల్ – అనీషా: తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు విశాల్ అనిషారెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నారు.ఇక వీరి నిశ్చితార్థం కూడా బ్రేక్ కావడంతో వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -