Trisha: చిరంజీవి కంటే బాలయ్యే గ్రేట్ అంటున్న హీరోయిన్ త్రిష.. ఏం జరిగిందో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Trisha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. త్రిష ప్రస్తుతం బాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం త్రిష కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుసగా సినిమాలలో నటించడంతో పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా టాలీవుడ్ లో సీనియర్ హీరోలైన చిరంజీవి , నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా అందరితోనూ నటించింది. అలాగే నేటి తరం స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ లతో నటించి మెప్పించింది.

ఇక తమిళం లో కూడా ఈమె రజినీకాంత్ తో తప్ప అందరి స్టార్ హీరోలతో కలిసి నటించేసింది. అయితే రీసెంట్ గా ఈమె టాలీవుడ్ లో ఈ నలుగురు సీనియర్ హీరోలలో ఎవరితో కలిసి నటించడానికి ఇష్టపడుతారు అని అడగగా, క్షణం కూడా ఆలోచించకుండా బాలయ్య బాబు పేరు చెప్పేసింది. యాంకర్ అడిగిన ఆ నలుగురు హీరోల పేర్లలో చిరంజీవి పేరు కూడా ఉంది. కానీ ఆమె చిరంజీవి పేరుని చెప్పడానికి ఇష్టపడలేదు. అంతే కాదు రీసెంట్ గా ఆమెకి చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో ఒక హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆమె ఆ చిత్రంలో నటించడానికి డేట్స్ ఖాళీ లేకపోవడంతో నో చెప్పేసింది.

కానీ ఇప్పుడు బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో మాత్రం నటించడానికి వెంటనే ఓకే చెప్పేసింది. దీనికి అర్థం ఈమెకి చిరంజీవి సినిమాకంటే ఎక్కువగా బాలయ్య సినిమానే ముఖ్యం అని కదా? అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య బాబు వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషన్ తర్వాత డైరెక్టర్ బాబీతో కలిసి చెయ్యడం వల్ల ఈ చిత్రం పై ప్రారంభ దశ నుండే మంచి హైప్ ఏర్పడింది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -